NTV Telugu Site icon

Tarun Chug : వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వ అడుగులు

Bandi Sanjay, Tarun Chugh

Bandi Sanjay, Tarun Chugh

వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వ అడుగులు పడుతున్నాయన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్. ఇవాళ ఆయన కరీంనగర్‌లో మాట్లాడుతూ.. దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టేలా చర్యలు .. ప్రపంచంలోనే ఇండియాను 3వ స్థానానికి తీసుకెళ్లడానికి నిరంతర కృషి చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా దేశాభివృద్ధి కోసం శ్రమిస్తుందని, దేశ ప్రజలంతా మోడీ ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారన్నారు. దేశంలో రాబోయేది.. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వం పోయినా .కాంగ్రెస్ రూపేనా మరో అవినీతి ప్రభుత్వము వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సర్కార్ జాతీయ కాంగ్రెస్ కి ఫండింగ్ చేస్తోందని, రాహుల్ యాత్ర కోసం రేవంత్ రెడ్డి విలువైన బస్సును ఏర్పాటు చేశారన్నారు. దేశంలో అధికారంలోకి రాని కాంగ్రెస్, బి ఆర్ఎస్ ల కు ఓటు వేయడం దండగ అని ఆయన వ్యాఖ్యానించారు.

 
Chiranjeevi: అవార్డు వచ్చినందుకు నాకు ఆనందంగా లేదు.. చిరు షాకింగ్ కామెంట్స్

అభివృద్ధి, సంక్షేమంను సమతూకం తో బడ్జెట్ ప్రవేశపెట్టారని, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి లక్ పతి పథకం ప్రవేశ పెట్టి 3కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూరేలా బడ్జెట్ కేటాయించిందన్నారు. గత పదేళ్లుగా మహిళల అక్షరాస్యత శాతం 25 పెరిగిందని, బీఆర్ఎస్ కు రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది .. అది కాంగ్రెస్ గెలుపు కాదని, గ్యారెంటీ లు అమలు చేయకుండా దాట వేస్తోందన్నారు. ఓఆర్ఆర్, కాళేశ్వరం, ధరణి అవినీతి అని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి నేడు నోరు మెదపడం లేదని, సీబీఐ విచారణ అని గతం లో చెప్పిన రేవంత్ రెడ్డి మిన్నకుండి పోవడం దేనికి సంకేతమన్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీ ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణా లో పదికి తగ్గకుండా పార్లమెంట్ స్థానాలను గెలుస్తామన్నారు.