Telangana: టెన్త్ పరీక్షలు.. టెన్షన్ పడుతున్న విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో టెన్త్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. మే 11 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కరోనా వల్ల ఈ ఏడాది కూడా అంతంత మాత్రమే క్లాసులు జరిగాయ్. దీంతో విద్యార్థులను పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. అటు పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.
తెలంగాణలో చివరిగా టెన్త్ పరీక్షలు 2018-2019 అకాడమిక్ ఇయర్లో జరిగాయి. ఆ తర్వాత రెండు బ్యాచ్ల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేశారు. పరీక్షలు నిర్వహించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కవుట్ కాలేదు.
Also Read
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
- Jagadish Reddy : పవన్ కళ్యాణ్ చదువుతోంది మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్
అయితే ఈ ఏడాది మే నెలలో పరీక్షలు నిర్వహించాలని అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇప్పుడు టెన్త్ చదువుతున్న విద్యార్థులకు గత రెండేళ్లుగా పెద్దగా క్లాస్లు జరగలేదు. ఈ ఏడాది కూడా అంతంత మాత్రమే జరిగాయి. షెడ్యూల్ ప్రకారం జనవరి 10 లోపు సిలబస్ పూర్తి చేయాలి సంక్రాంతి సెలవులు, ఇతర కారణాలతో ఈ నెలాఖరు వరకు పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఈసారి విద్యాశాఖ ఉన్నతాధికారులు పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. దాంతో సిలబస్ ఇంకా పెండింగ్లోనే ఉంది.
గతంలో ప్రతి ఏడాది పదో తరగతి పరీక్షలు మార్చిలో మొదలై ఏప్రిల్ వరకు జరిగేవి. డిసెంబర్ నుంచే ఎడ్యుకేషనల్ డైరెక్టరేట్ నుంచి దానికి తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసేవారు. కానీ ఇప్పుడు పరీక్షల నిర్వహణపై ఎలాంటి ప్రణాళిక లేదు.దాంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు విద్యార్థులు. పైతరగతులకు టెన్త్ క్లాస్ బేస్మెంట్ కాబట్టి మార్కులు తగ్గితే ఎలా అనే గందరగోళంలో ఉన్నారు. మార్చి నెలలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టడానికి సన్నద్ధమవుతున్నారు. కానీ చాలా చోట్ల ఇంకా సిలబస్ కూడా పూర్తి కాలేదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి.. టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
-
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్లో సూర్య..
-
Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!