Telangana: టెన్త్ పరీక్షలు.. టెన్షన్ పడుతున్న విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో టెన్త్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. మే 11 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కరోనా వల్ల ఈ ఏడాది కూడా అంతంత మాత్రమే క్లాసులు జరిగాయ్. దీంతో విద్యార్థులను పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. అటు పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.
తెలంగాణలో చివరిగా టెన్త్ పరీక్షలు 2018-2019 అకాడమిక్ ఇయర్లో జరిగాయి. ఆ తర్వాత రెండు బ్యాచ్ల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేశారు. పరీక్షలు నిర్వహించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కవుట్ కాలేదు.
Also Read
అయితే ఈ ఏడాది మే నెలలో పరీక్షలు నిర్వహించాలని అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇప్పుడు టెన్త్ చదువుతున్న విద్యార్థులకు గత రెండేళ్లుగా పెద్దగా క్లాస్లు జరగలేదు. ఈ ఏడాది కూడా అంతంత మాత్రమే జరిగాయి. షెడ్యూల్ ప్రకారం జనవరి 10 లోపు సిలబస్ పూర్తి చేయాలి సంక్రాంతి సెలవులు, ఇతర కారణాలతో ఈ నెలాఖరు వరకు పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఈసారి విద్యాశాఖ ఉన్నతాధికారులు పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. దాంతో సిలబస్ ఇంకా పెండింగ్లోనే ఉంది.
గతంలో ప్రతి ఏడాది పదో తరగతి పరీక్షలు మార్చిలో మొదలై ఏప్రిల్ వరకు జరిగేవి. డిసెంబర్ నుంచే ఎడ్యుకేషనల్ డైరెక్టరేట్ నుంచి దానికి తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసేవారు. కానీ ఇప్పుడు పరీక్షల నిర్వహణపై ఎలాంటి ప్రణాళిక లేదు.దాంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు విద్యార్థులు. పైతరగతులకు టెన్త్ క్లాస్ బేస్మెంట్ కాబట్టి మార్కులు తగ్గితే ఎలా అనే గందరగోళంలో ఉన్నారు. మార్చి నెలలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టడానికి సన్నద్ధమవుతున్నారు. కానీ చాలా చోట్ల ఇంకా సిలబస్ కూడా పూర్తి కాలేదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి.. టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!