NTV Telugu Site icon

మహిళల రక్షణలో తెలంగాణ నెంబర్‌ వన్‌: మంత్రి సత్యవతి రాథోడ్‌

మహిళల సంరక్షణలో తెలంగాణ నెంబర్‌వన్‌ గా ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. బంజరాహిల్స్‌లోని మిథాలినగర్‌లోని సఖీ సెంటర్‌కు మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, ఎమ్మెల్సీ వాణి దేవి, ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్‌తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఆమె మాట్లాడారు.

మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందన్నారు. మొన్ననే సీఎం కేసీఆర్‌ గంజాయి నిర్మూలన కోసం సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. కొన్ని సఖీ సెంటర్లు ప్రైవేట్‌ భవానాల్లో ఉన్నాయని వాటికి త్వరలోనే శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. మహిళల భద్రత కోసం పోలీస్‌ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందన్నారు.తెలంగాణ ప్రభుత్వం మహిళ సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అక్కడక్కడా చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయని అలా జరగకుండా చూస్తామని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు.