Sad incident: తల్లి అంత్యక్రియలకు బ్యాంకులో రుణం.. కట్టలేక కొడుకు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sad incident: సంగారెడ్డి జిల్లాలో హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియల కోసం బ్యాంకులో చేసిన అప్పులు కట్టలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పటాన్ చెరు (మం) రుద్రారం గ్రామంలో శ్రీనివాస్, భార్యతో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. అయితే.. 6 నెలల క్రితం తన తల్లి చనిపోయింది. తనని అల్లారుముద్దుగా కంటి రెప్పలా చూసుకున్న తల్లి చనిపోవడంతో శ్రీనివాస్ కన్నీరుమున్నీరయ్యాడు. అయితే తన తల్లి అంత్యక్రియలు చేసేందుకు శ్రీనివాస్ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. తన సంపాదనతోనే ఇంటిని నెట్టికొచ్చిన శ్రీనివాస్ కు అప్పటికప్పుడే భారీ మొత్తంలో డబ్బులు సేకరించేందుకు నానా కష్టాలు పడ్డాడు. తల్లి అంత్యక్రియలకు చివరకు బ్యాంక్ లో లోన్ తీసుకుందామని భావించిన శ్రీనివాస్ బ్యాంక్ అధికారులకు ఫోన్ చేసి డబ్బులను తీసుకున్నాడు. అయితే తల్లి అంత్యక్రియలను భారీగానే చేశాడు.
Read also: Kerala: కేరళ హోటల్ యజమాని హత్య కేసులో ట్విస్ట్.. సెక్స్ స్కాండల్ కోణం..
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
తల్లిని మాత్రం ఏ మాత్రం కష్ట లేకుండా చూసుకున్న శ్రీనివాస్ తన తల్లి మరణంతో కుంగిపోయాడు. అయితే గత మూడు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో శ్రీనివాస్ EMI కట్టలేదు. దీంతో.. శ్రీనివాస్ కు లోన్ వేధింపులకు మొదలయ్యాయి. ఫోన్ చేసి EMI కట్టాలని లోన్ రికవరీ ఏజెంట్ల బెదిరింపులకు పాల్పడ్డారు. లోన్ కట్టకపోతే స్నేహితులకు, బందువులకు తెలియజేసి పరువుతీస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అసలే తల్లి పోయాన పుట్టడు దుఖంతో వున్న శ్రీనివాస్ కు లోన్ కట్టాలని వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో రోజు ఈ వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే శ్రీనివాస్ భార్య చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బ్యాంక్ అధికారుల వేధింపుల వల్లే తన భర్త చనిపోయాడని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటికి పెద్దదిక్కుగా వున్న శ్రీనివాస్ మృతి చెందాడని ఇప్పుడు మాకు దిక్కెవరంటూ కన్నీరుమున్నీరయ్యారు. తగిన న్యాయం చేసేంత వరకు ఈఘటనకు కారకులైన వారిని విడిచిపెట్టేదే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kerala: కేరళ హోటల్ యజమాని హత్య కేసులో ట్విస్ట్.. సెక్స్ స్కాండల్ కోణం..
తాజావార్తలు
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..