Sad incident: తల్లి అంత్యక్రియలకు బ్యాంకులో రుణం.. కట్టలేక కొడుకు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sad incident: సంగారెడ్డి జిల్లాలో హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియల కోసం బ్యాంకులో చేసిన అప్పులు కట్టలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పటాన్ చెరు (మం) రుద్రారం గ్రామంలో శ్రీనివాస్, భార్యతో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. అయితే.. 6 నెలల క్రితం తన తల్లి చనిపోయింది. తనని అల్లారుముద్దుగా కంటి రెప్పలా చూసుకున్న తల్లి చనిపోవడంతో శ్రీనివాస్ కన్నీరుమున్నీరయ్యాడు. అయితే తన తల్లి అంత్యక్రియలు చేసేందుకు శ్రీనివాస్ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. తన సంపాదనతోనే ఇంటిని నెట్టికొచ్చిన శ్రీనివాస్ కు అప్పటికప్పుడే భారీ మొత్తంలో డబ్బులు సేకరించేందుకు నానా కష్టాలు పడ్డాడు. తల్లి అంత్యక్రియలకు చివరకు బ్యాంక్ లో లోన్ తీసుకుందామని భావించిన శ్రీనివాస్ బ్యాంక్ అధికారులకు ఫోన్ చేసి డబ్బులను తీసుకున్నాడు. అయితే తల్లి అంత్యక్రియలను భారీగానే చేశాడు.
Read also: Kerala: కేరళ హోటల్ యజమాని హత్య కేసులో ట్విస్ట్.. సెక్స్ స్కాండల్ కోణం..
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
తల్లిని మాత్రం ఏ మాత్రం కష్ట లేకుండా చూసుకున్న శ్రీనివాస్ తన తల్లి మరణంతో కుంగిపోయాడు. అయితే గత మూడు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో శ్రీనివాస్ EMI కట్టలేదు. దీంతో.. శ్రీనివాస్ కు లోన్ వేధింపులకు మొదలయ్యాయి. ఫోన్ చేసి EMI కట్టాలని లోన్ రికవరీ ఏజెంట్ల బెదిరింపులకు పాల్పడ్డారు. లోన్ కట్టకపోతే స్నేహితులకు, బందువులకు తెలియజేసి పరువుతీస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అసలే తల్లి పోయాన పుట్టడు దుఖంతో వున్న శ్రీనివాస్ కు లోన్ కట్టాలని వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో రోజు ఈ వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే శ్రీనివాస్ భార్య చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బ్యాంక్ అధికారుల వేధింపుల వల్లే తన భర్త చనిపోయాడని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటికి పెద్దదిక్కుగా వున్న శ్రీనివాస్ మృతి చెందాడని ఇప్పుడు మాకు దిక్కెవరంటూ కన్నీరుమున్నీరయ్యారు. తగిన న్యాయం చేసేంత వరకు ఈఘటనకు కారకులైన వారిని విడిచిపెట్టేదే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kerala: కేరళ హోటల్ యజమాని హత్య కేసులో ట్విస్ట్.. సెక్స్ స్కాండల్ కోణం..
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!