Kagaznagar Train: రైలులో పొగలు.. చైన్ లాగిన ప్రయాణికులు.. ఆ తరువాత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kagaznagar Train: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ రైలులో తృటిలో ప్రమాదం తప్పింది. బీబీ నగర్ సమీపంలో రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు. హుటాహుటిన కిందికి దిగి పరుగులు పెట్టారు. అనంతరం రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే బీబీ నగర్ స్టేషన్లో రైలును నిలిపివేశారు. ప్రయాణికులందరిని రైలు నుంచి దింపివేసారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి హానీ జరగకపోవడంతో.. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలులో పొగలు రావడానికి గల కారణం ఏముంటుందని ఆరా తీస్తున్నారు అధికారులు. ప్రయాణికులు గమనించి మాకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రైలును ఆపివేసామని వెల్లడించారు. పొగలకు గల కారణాలను వెంటనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికి ఎలాంటి హానీ జరగలేదని స్పష్టం చేశారు.
Read also: Rajinikanth: కోలీవుడ్ లో కాస్త ముందే మొదలైన తలైవర్ బర్త్ డే సెలబ్రేషన్స్…
Also Read
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
కాగా.. గతంలోనూ పలు రైళ్లలో మంటలు, పొగలు వ్యాపించాయి. 13 ఆగస్టు 2023న ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలులో పొగ కనిపించింది. దీంతో స్టేషన్ఘన్పూర్ రైల్వేస్టేషన్లో రైలు నిలిచిపోయింది. ఈ రైలులోని నాల్గవ కోచ్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. స్టేషన్ఘన్పూర్ రైల్వే స్టేషన్లో రైలు ఆగింది. మరమ్మతులు చేపట్టి రైలును వెనక్కి పంపించారు. 16 జూన్ 2021న ఇంటర్ సిటీ రైలులో కూడా పొగ వచ్చింది. తలమాడు మండలం దూర్లి గేట్ వద్ద పొగలు రావడంతో రైలు ఇంజన్ ఆగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16న పొగలు కమ్ముకోవడంతో నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలు మహబూబాద్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. రైలు అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక 2022 నవంబర్ 17, 2022 న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు వద్ద నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి మరియు రైల్వే సిబ్బంది దానిని గుర్తించి మంటలను ఆర్పారు. మంటలను ఆర్పేందుకు గూడూరు రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు. గతంలో జూన్ 27, 2022న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో పొగ వ్యాపించింది. దీంతో రైలు డోర్నకల్ రైల్వేస్టేషన్లో నిలిచిపోయింది. పొగలు వ్యాపించిన బోగీలను వేరు చేసి మరో బోగీకి తరలించారు.
Rajasthan: రాజస్థాన్లో మోడీ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు.. వసుంధర రాజే లేదా ఓం మాథుర్?
తాజావార్తలు
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!