CM Revanth Reddy : SLBC పూర్తికి తెలంగాణ ప్రభుత్వం డెడ్లైన్
- ఎస్ఎల్బీసీ పనుల్లో ఆలస్యం సహించబోమన్న సీఎం రేవంత్
- 2027 డిసెంబర్ 9 నాటికి ప్రజలకు అంకితం చేయనున్న ఎస్ఎల్బీసీ
- సొరంగం పనులకు జేపీ అసోసియేట్స్ సిద్ధం కావాలని ఆదేశం
- గ్రీన్ ఛానల్లో నిధుల సమకూర్చనున్న తెలంగాణ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాల్వ) పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కాకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, డిసెంబర్ 9, 2027 నాటికి ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ కేవలం నల్గొండ జిల్లా అవసరాలకే కాకుండా మొత్తం రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమని, ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా నీటిని అందించే అవకాశం ఉన్నందున ప్రాజెక్ట్ పూర్తిని ఏ విధంగానూ వాయిదా వేయరాదని ఆయన అధికారులు, కాంట్రాక్టర్లకు హెచ్చరిక జారీ చేశారు.
China Tomb Raiding Case: డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. సమాధులను తవ్వి కటకటాల పాలయ్యాడు..
Also Read
- Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్లో రోడ్డెక్కిన యువత
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న సీఎం, అటవీ శాఖ అనుమతుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎస్ఎల్బీసీ పనులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్లోనే నిధులు అందజేస్తుందని హామీ ఇస్తూ, పనుల్లో అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగాలని ఆదేశించారు.
సొరంగం పనులను చేపట్టే కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను వెంటనే సిద్ధం చేసుకోవాలని, ఒక్కరోజు ఆలస్యం జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. సొరంగం తొవ్వకంలో సింగరేణి నిపుణుల సహాయాన్ని వినియోగించుకోవాలని సూచించిన సీఎం, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆగిపోకుండా చూడాలని హెచ్చరించారు. డిసెంబర్ 9, 2027 నాటికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తుది గడువుగా ప్రకటించారు.
US Media: అమెరికన్లను వణికిస్తున్న “మోడీ-పుతిన్-జిన్పింగ్” ఫోటో..
తాజావార్తలు
-
Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
IND vs SL: తొలి టెస్టు టీమ్లో బిగ్ సర్ప్రైజ్.. సీనియర్కు నో ప్లేస్, కొత్త కుర్రాడు అరంగేట్రం!
-
Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
ట్రెండింగ్
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!