కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఆరు ప్రవేటు హాస్పిటల్స్ కు వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించని ప్రవేటు హాస్పిటల్స్ లైసెన్సు లు 15 రోజుల పాటు రద్దు చేసింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జూవెరియా. ప్రవేటు హాస్పిటల్స్ లో విజిలెన్స్ కమిటి తనిఖీ చేసి నెల రోజులు లోగా సమాధానం ఇవ్వాలని షోకాస్ నోటీసులు చేసిన స్పందించని ఆరు హస్పిటల్స్ కు లైసెన్స్ లు రద్దు చేసారు. కరీంనగర్ లోని పుల్లెల ప్రవేటు హాస్పిటల్, మురుగన్ హాస్పిటల్, కృష్ణ లేపాక్షి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జమ్మికుంట లోని మమత,సురక్ష హస్పిటల్స్ లు నోటీసులు జారీ చేసింది. అధిక బిల్లులు వసూలు, శానిటేషన్ సరిగా లేకపోవడం, సరైన వైద్య సేవలు అందించడం లేదని ప్రజల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు అధికారులు.