Sigachi Blast : నేడు పాశమైలారం సిగాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం
- సిగాచి పేలుడు ఘటనపై కేంద్రం స్పందన
- తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- NDMA బృందం విచారణ.. భద్రతా లోపాలపై ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sigachi Blast : సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఫేజ్-3 లోని సిగాచి (Sigachi) పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) బృందం నేడు సంఘటన స్థలాన్ని సందర్శించనుంది. NDMA బృందం, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (SDMA) తో కలిసి పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై సవివరంగా అధ్యయనం చేయనుంది. ప్రమాదానికి కారణమైన పరిస్థితులు, భద్రతా లోపాలు, గ్యాస్ లీక్ లేదా రసాయన సంచయాల దుర్వినియోగంపై సమగ్రంగా దర్యాప్తు జరగనుంది.
పేలుడు ఘటన చోటుచేసుకున్నది తొమ్మిది రోజుల క్రితం. అప్పటి నుంచి రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలంలో మృతదేహాల కోసం నిరంతరం శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు 42 మంది కార్మికుల మృతదేహాలు వెలికి తీసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇంకా 8 మంది ఆచూకీ తెలియరావడం లేదు. వారి ఆచూకీ లభిస్తుందేమోనని ఆందోళనతో ఎదురు చూస్తున్నారు కార్మికుల కుటుంబసభ్యులు.
Also Read
పేలుడులో కొంతమంది మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో, అధికారులు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎలాంటి ఆలస్యం జరగకుండా, మృతుల గుర్తింపు కోసం ఆయా శాఖలు సమన్వయంగా పని చేస్తున్నాయి.
ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం 143 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 61 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడిన 18 మంది చికిత్స పొందుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదివరకే చికిత్స అనంతరం 14 మంది కార్మికులు డిశ్చార్జ్ అయ్యారు.
NDMA బృందం పరిశ్రమను పరిశీలించనున్న ఈ సందర్భం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడంలో కీలకంగా మారనుంది. పరిశ్రమ భద్రతా ప్రమాణాలు, శ్రామికుల రక్షణ చర్యలపై ఈ అధ్యయనం ప్రభావం చూపే అవకాశం ఉంది.
Wiaan Mulder: అందుకే బ్రియాన్ లారా రికార్డ్ ను వదిలేశా.. వియాన్ ముల్డర్ సంచలన వ్యాఖ్యలు..!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?