Site icon NTV Telugu

Siddipet: కొండపోచమ్మ ప్రాజెక్టులో ఐదుగురు గల్లంతు.. ఘటనపై సీఎం ఆరా

Swimming

Swimming

సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సెల్ఫీ సరదా యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. సంక్రాంతి సెలవులు కావడంతో సరదాగా స్నేహితులు కలిసి కొండపోచమ్మ ప్రాజెక్టు చూసేందుకు వెళ్లారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు కొండపోచమ్మ ప్రాజెక్టు చూడటానికి వచ్చారు. ఈ క్రమంలో.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ప్రాజెక్టు దగ్గర సెల్ఫీ దిగడానికి వెళ్లి ఫోటోలు దిగుతూ ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.

Read Also: Dil Raju: తెలంగాణ ప్రజానికానికి దిల్‌రాజు క్షమాపణలు..

మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. క్షేమంగా బయటపడ్డ యువకులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. దీంతో.. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం.. గజ ఈతగాళ్ల సాయంతో ఐదుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈత రాకపోవడంతో ఒకరి చేయి పట్టుకుని మరొకరు డ్యామ్ లోకి దిగారు. ప్రాజెక్టు లోపల మునిగిపోతుండగా భయతో ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకోవడంతో యువకులు నీటిలో మునిగిపోయారు. యువకులంతా 20 ఏళ్ల లోపు వారే ఉన్నట్లు గుర్తించారు. గల్లంతైన యువకులలో ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ గా ఉన్నారు.

Read Also: Sankranthi Rush: పల్లెబాట పట్టిన పట్నం వాసులు.. టోల్ ప్లాజాల దగ్గర రద్దీ

కొండపోచమ్మ ప్రాజెక్టులో యువకుల గల్లంతు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గల్లంతైన వారికోసం గజ ఈత గాళ్లను రప్పించాలని తెలిపారు. జిల్లా అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Exit mobile version