Site icon NTV Telugu

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు..

Phone Tapping Case

Phone Tapping Case

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్‌ కన్ఫెషన్ స్టేట్మెంట్‌లో సంచలన విషయాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. మధ్యవర్తుల ఫోన్లను ట్యాప్ చేయడంతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడిందని తేలింది. ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలో ప్రభాకర్ రావు పెద్ద ఎత్తున స్పై కెమెరాలు, ఆడియో పరికరాలను కొనుగోలు చేశారు. రోహిత్ రెడ్డితో పాటు కొందరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు.

Read also: Pune : పూణే పోర్షే ప్రమాదం.. మైనర్ రక్త నమూనాను ట్యాంపర్ చేసిన డాక్టర్లు అరెస్టు

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ బీఎల్ ఏ మాత్రం సంతోష్ ను అడ్డం పెట్టుకుని కవితను మద్యం స్కాం నుంచి తప్పించాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఆడియోలను ముందుకు తెచ్చి ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరతీసినట్లు తేలింది. నాడు బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలపై బీజేపీ, బీఆర్ఎస్ ఎలా స్పందిస్తాయో చూడాలి.

Canara Bank: బ్యాంకులో బంగారం గోల్ మాల్.. బ్యాంక్ అధికారి చేతివాటం..

Exit mobile version