కేంద్ర మంత్రి అమిత్ షాపై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. అమిత్ షా గారి మాటలకు ఊదు కాలదు.. పీరు లేవదని షర్మిల ఎద్దేవ చేశారు. అవినీతి చేస్తున్నారని తెలిసికూడా మీ పాతమిత్రుడు KCR ని అరెస్ట్ చెయ్యరు! ఎందుకని ఆమె నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతీ పథకంలో వాటా ఉందన్న మీరు.. KCR అవినీతిలో మీకువాటాలేదంటే మేము నమ్మాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 ఏండ్లుగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలిచ్చారని, ఇక తెలంగాణలో కూడా ఇస్తారా? అని ప్రశ్నించారు.
కేంద్రంలో అధికారంలో ఉండికూడా తెలంగాణ బాయిల్డ్ రైస్ కొనని మీరు.. తెలంగాణలో అధికారంలోకి వస్తే కొంటారా? అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రైతులను కార్లతో గుద్దిచంపిన మీరు! మా రైతాంగాన్ని ఆదుకుంటామని చెవిలో పూలు పెడుతున్నారా? అని మండి పడ్డారు. చట్టబద్ధంగా ఇచ్చిన విభజన హామీలకే దిక్కులేదు , ఇక ఏం మొహం పెట్టుకొని ఒక్క చాన్స్ అడుగుతున్నారు? అని ఆమె ప్రశ్నించారు.
నిలబెట్ట చేతకాదుగానీ.. కూలగొట్టడంలో దిట్టలు మీరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలను బలిపశువులను చేసి, అధీకారపీఠాలను ఎక్కుతున్న మీరు.. వాల్లకున్న 4% రిజర్వేషన్ తీసెయ్యడం కాకుండా ఇంకేం ఆలోచించగలరు? అని ఆమె నిప్పులు చెరిగారు.
YSR గారు ఇచ్చిన రిజర్వేషన్ మోదీ, షా కలిసొచ్చినా పీకెయ్యలేరని ధీమా వ్యక్తం చేశారు. మీ మతోన్మాదాన్ని ఎదిరించగలగేది ఒక్క YSR స్పూర్తి మాత్రమే అని షర్మిళ ఈ సందర్భంగా తెలిపారు.
Karate Kalyani: ఒక్కొక్కటిగా బయటపడుతున్న కరాటే కళ్యాణి ఆగడాలు..