Ibrahimpatnam Firing Case: కాల్పుల కేసులో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పుల వ్యవహారం సంచలనగా మారింది.. ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.. అయితే, ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి చేసిన భూ సెటిల్మెంట్లే హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు.. సెటిల్మెంట్లతో పాటు శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కూడా దృష్టి సారించారు పోలీసులు.. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్దమొత్తంలో ఆస్తులు కొనుగోలు చేశారు శ్రీనివాస్ రెడ్డి… ఆస్తులన్నింటినీ కూడా హఫీజ్, నవీన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. దీంతో.. హఫీజ్, నవీన్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్లోని అతిపెద్ద సిటీ రష్యా స్వాధీనం
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
పదుల సంఖ్యలో ఆస్తులను నవీన్, హఫీజ్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు శ్రీనివాస్ రెడ్డి.. ఇక, తుర్కయంజాల్ సమీపంలో ఇటీవల కాలంలో శ్రీనివాస్రెడ్డి పెద్ద సెటిల్మెంట్ చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ వ్యవహారంలో కూడా పెద్ద మొత్తంలో శ్రీనివాస్ రెడ్డికి డబ్బులు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం.. మరోవైపు, డబుల్ రిజిస్ట్రేషన్ అయిన భూములను శ్రీనివాసరెడ్డి స్వాధీనం చేసుకుని సెటిల్మెంట్లు చేస్తారని చెబుతున్నారు.. ఇతర ప్రాంతంలో జరిగిన సెటిల్మెంట్ వ్యవహారంలోనే శ్రీనివాస్రెడ్డిని హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇద్దరు ప్రాణాలను బలిగొన్న ఇబ్రహీంపట్నం కాల్పుల కేసుకు సంబంధించి మీడియా సంయమనం పాటించాలని కోరారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్.. కాల్పుల ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.. కేసు విచారణలో ఉంది.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా పురోగతి ఉంటే మీడియాకు చెబుతాం అన్నారు.. కాగా, మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు రియల్టర్లు శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్రరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ ఘటనకు సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసులు మట్టారెడ్డి, హఫీజ్, కృష్ణ సహా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!