Ibrahimpatnam Firing Case: కాల్పుల కేసులో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పుల వ్యవహారం సంచలనగా మారింది.. ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.. అయితే, ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి చేసిన భూ సెటిల్మెంట్లే హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు.. సెటిల్మెంట్లతో పాటు శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కూడా దృష్టి సారించారు పోలీసులు.. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్దమొత్తంలో ఆస్తులు కొనుగోలు చేశారు శ్రీనివాస్ రెడ్డి… ఆస్తులన్నింటినీ కూడా హఫీజ్, నవీన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. దీంతో.. హఫీజ్, నవీన్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్లోని అతిపెద్ద సిటీ రష్యా స్వాధీనం
Also Read
- Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
పదుల సంఖ్యలో ఆస్తులను నవీన్, హఫీజ్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు శ్రీనివాస్ రెడ్డి.. ఇక, తుర్కయంజాల్ సమీపంలో ఇటీవల కాలంలో శ్రీనివాస్రెడ్డి పెద్ద సెటిల్మెంట్ చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ వ్యవహారంలో కూడా పెద్ద మొత్తంలో శ్రీనివాస్ రెడ్డికి డబ్బులు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం.. మరోవైపు, డబుల్ రిజిస్ట్రేషన్ అయిన భూములను శ్రీనివాసరెడ్డి స్వాధీనం చేసుకుని సెటిల్మెంట్లు చేస్తారని చెబుతున్నారు.. ఇతర ప్రాంతంలో జరిగిన సెటిల్మెంట్ వ్యవహారంలోనే శ్రీనివాస్రెడ్డిని హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇద్దరు ప్రాణాలను బలిగొన్న ఇబ్రహీంపట్నం కాల్పుల కేసుకు సంబంధించి మీడియా సంయమనం పాటించాలని కోరారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్.. కాల్పుల ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.. కేసు విచారణలో ఉంది.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా పురోగతి ఉంటే మీడియాకు చెబుతాం అన్నారు.. కాగా, మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు రియల్టర్లు శ్రీనివాస్రెడ్డి, రాఘవేంద్రరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ ఘటనకు సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసులు మట్టారెడ్డి, హఫీజ్, కృష్ణ సహా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!