Nallu Indrasena Reddy: ఎవరు పనితీరు ఏంటో మోడీకి తెలుసు.. రేవంత్ పై ఇంద్రసేనా రెడ్డి ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nallu Indrasena Reddy: రేవంత్రెడ్డిపై త్రిపుర రాష్ట్ర గవర్నర్గా నియమితులైన నల్లు ఇంద్రసేనారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు పనితీరు ఏంటో మోడీకి తెలుసరి ఇంద్రసేనారెడ్డి ఫైర్ అయ్యారు. రెడ్లకు తానే ప్రతినిధినని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డినైన తనకు గవర్నర్ పదవి వచ్చిందనందుకు రేవంత్ రెడ్డి బాధ పడిపోతున్నారని మండిపడ్డారు. ఎంతసేపూ ఇతరులను ఇరకాటంలో పెట్టడమే రేవంత్ రెడ్డి పని అంటూ వ్యాఖ్యలు చేశారు. సొసైటీని డివైడ్ చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రెడ్లకు తానే ప్రతినిధినని రేవంత్ ఓపెన్గా అనేకసార్లు చెప్పారన్నారని స్పష్టం చేశారు. మోడీ స్వయంగా ఫోన్ చేసి త్రిపుర గవర్నర్గా నియమిస్తున్నట్లు చెప్పారని.. తన సిన్సియారిటీ గురించి ఏపీ, తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. ఎవరు పనితీరు ఏంటో మోడీకి తెలుసన్నారు. ఎప్పుడు ఎవరకి ఏ బాధ్యతలు ఇవ్వాలో వారికి తెలుసని చెప్పుకొచ్చారు. గతంతో పోల్చితే మోడీ హాయాంలో ఈశాన్య రాష్ట్రాలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయని నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు.
త్రిపుర గవర్నర్గా తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఆయనను గవర్నర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం (అక్టోబర్ 18) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్గా నియమితులైన తర్వాత ఇంద్రసేనారెడ్డి తొలిసారి స్పందించారు. బీజేపీలో ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. గవర్నర్గా నియమితులైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. మలక్ పేట నియోజకవర్గ ప్రజలకు ఈ గుర్తింపు వస్తుందన్నారు. ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తానని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.
Kishan Reddy: రామప్ప అభివృద్ధి చేసింది మేమే.. రాహుల్, ప్రియాంక మోడీకి థ్యాంక్స్ చెప్పాలి..
Also Read
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
తాజావార్తలు
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
Economic D-Day: ఇరాన్కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!