Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Sensational Comments Of Mla Etela Rajender On Cm Kcr

Etela Rajender: నిషేధం ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు?

NTV Telugu Twitter
Published Date :May 24, 2023 , 1:06 pm
By NTV WebDesk
Etela Rajender: నిషేధం ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Etela Rajender: నిషేధం ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారని హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ ప్రశ్నించారు. వేల కోట్ల భూములు గోల్డ్ స్టోన్ ప్రసాద్ మేనేజ్‌ చేసేవారని అన్నారు. అవన్నీ కేసీఆర్ అనుచరులకు అప్ప చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ భూములను కొల్లగొడుతున్నారు అని చెప్పేవాడని గుర్తు చేశారు. అనంత గిరిగా లకోమ్ మరిజోమ్ క దవా అని చెప్పేవారని అన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల కోసం 111 జీవో తీసివేస్తా అంటున్నాడని మండిపడ్డారు. నిజాం కాలంలో 1908 లో హైదరాబాద్ కు వరదలు వచ్చి 15 వేల మంది చనిపోయారని తెలిపారు. ఆ తర్వాత జంట జలాశయాలు నిర్మాణము చేశారని అన్నారు. దీనితో వరద నివారణ, తాగునీరు, పర్యావరణ పరిరక్షణ, భూగర్భజలాలు లాంటి నాలుగు ప్రయోజనాలు వచ్చాయని అన్నారు.

ఇప్పుడు గోదావరి కృష్ణ నుంచి నీళ్లు వస్తున్నాయి అంటున్నారు.. కేసీఆర్ అనుచరులు వేల కోట్ల రూపాయలు లబ్ది చేకూరాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు రైతుల దగ్గర భూములు లేవు, 18 వేల ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ లో ఎంత ఎండ ఉన్నా సాయంత్రం అయ్యే సరికి చల్లబడడానికి కారణం అక్కడ ఉన్న చెట్లు అని అన్నారు. హైదరాబాద్ నగర ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఉండే పరిస్థితి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తక్షణమే ఆపివేసి… సమీక్ష చేయాలని కోరారు. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ కు పోతే ఆగిపోయిందని, ఇప్పుడు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కు పోతే ఆగిపోతుందని ఈటెల పేర్కొన్నారు. ధరణి రైతుల కొంప ముంచిందని, దరణిలో 14 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారని, ఎన్నో తప్పులు జరిగాయని ఆరోపించారు. తెలంగాణ రైతులు నిశ్చింతగా నిద్ర పోయే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 613 మియాపూర్ భూములు ఏమయ్యాయి? నిషేధం ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. వేల కోట్ల భూములు గోల్డ్ స్టోన్ ప్రసాద్ మేనేజ్‌ చేసేవారని అన్నారు. అవన్నీ కేసీఆర్ అనుచరులకు అప్ప చెబుతున్నారని తీవ్రంగా ఆరోపించారు.

మియాపూర్ స్కాం ఎందుకు బయట పెట్టట్లేదని? ప్రశ్నించారు. ఇలా వచ్చిన డబ్బుతో రాబోయే రోజుల్లో రాజకీయాలు చేస్తారని ఆరోపించారు. నాలాంటి వాళ్ళ గొంతు కోయాలని ఓటు ఐదు వేల రూపాయలు ఇస్తారని ఆరోపణలు గుప్పించారు. కొత్త సచివాలయంలో ఎమ్మెల్యే లకు కూడా అనుమతి లేదు, సామాన్య పబ్లిక్ కు అసలు అనుమతి లేదని మండిపడ్డారు. నిన్న మొన్న కొన్ని వార్తలు చూశానని, మా అధ్యక్షుడికి, తనకు గొడవ అయినట్టు, సెల్ ఫోన్ లు విసిరి వేసుకున్నట్టుగా వార్తలు రాసారని మండిపడ్డారు. ఇలాంటి పనులు తను చేయనని స్పష్టం చేశారు. చాలా ఊహాగానాలు వస్తున్నాయని, నిన్నటి వరకు కాంగ్రెస్ లేవదని చర్చ జరిగిందని గుర్తు చేశారు. కర్ణాటకలో గెలవగానే తెలంగాణలో గెలుస్తుందా? అంటూ ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ లోకి వెళ్లారని గుర్తు చేశారు. రేపు కాంగ్రెస్ , బీఆర్ఎస్‌ కలుస్తాయి ఏమో అని ప్రచారం జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్షుడు బాగానే పని చేస్తున్నారని, బీజేపీ తెలంగాణలో గెలవాలంటే ఇంకా శక్తి కావాలి అంటున్నామని ఈటెల రాజేందర్‌ తెలిపారు.
Miserable Countries: ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశాలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • mla etela rajender
  • MLA Etela Rajender on CM KCR
  • sensational comments
  • Sensational comments BJP

తాజావార్తలు

  • Plane Crash: విషాద గాధ.. ప్రారంభంలోనే ముగిసిన ఎయిర్ హోస్టెస్ కెరీర్..

  • East Godavari: గంజాయి రవాణా చేస్తున్న భార్యాభర్తలు.. అరెస్టు చేసిన పోలీసులు

  • Tollywood: రేపు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యే సినీ ప్రముఖుల లిస్ట్ ఇదే!

  • Leopard : సంగారెడ్డి జిల్లా కల్హేర్‌లో చిరుత కలకలం.. బీబీపేట్ గ్రామంలో భయాందోళనలు

  • Ram Mohan Naidu: “నా తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారు.. ఆ బాధ నాకు తెలుసు”

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions