Manda Krishna Madiga: చెన్నూరులో మాకు టిక్కెట్ రాకుండా చేస్తే.. వారిని ఒడిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manda Krishna Madiga: నవంబర్ 30 లోపు sc వర్గీకరణ విషయం తేల్చాలని.. సమస్య పరిష్కారానికి ఎవ్వరూ చొరవ తీసుకుంటారో వారికి మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడ మంద కృష్ణ మాదిగ అన్నారు. మంచిర్యాల జిల్లాలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. మా సమస్య ను పట్టించుకోని వారిని మా ప్రజల్లో ఎండకడుతామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మోడీ ప్రధాని అయినప్పటికీ నుండి ఎన్నో బిల్లులు పాస్ అయ్యాయని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును బీజేపీ నవంబర్ లో జరిగే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం లోని బీజేపీ నాయకులు ఎస్టీ వర్గీకరణ బిల్లు పెట్టించాలని, కాంగ్రెస్ ఎస్టీ వర్గీకరణ పై చిత్తశుద్ది ప్రకటించాలని తెలిపారు. కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు బిల్లు పెట్టలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిల్లు పెట్టమని అదికార పార్టి పై ఒత్తిడి చేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రధానికి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే లేఖలు రాయాలన్నారు. డిక్లరేషన్ లో పెట్టడం కాదన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎస్టీ వర్గీకరణ విషయంలో చొరవ తీసుకోవాలన్నారు. కేసిఆర్ పాలనలో మాదిగలకు అవమానాలు, అణచివేతలు జరుగుతున్నాయని తెలిపారు. నిండు అసెంబ్లీ కేంద్రం వద్దకు అఖిల పక్షాన్ని తీసుకుపోతమన్నరని అన్నారు. ఇప్పుడు ప్రధాన మంత్రి వద్దకు అఖిల పక్షాన్ని తీసుకోవాలని తెలిపారు. లేని పక్షంలో ప్రజా క్షేత్రంలో బుద్ది చెప్పుతామని అన్నారు.
నవంబర్ మొదటి వారంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని, అప్పటి వరకు ఎస్టీ వర్గీకరణ బిల్లు పెట్టాలని కోరారు. ఎస్టీ వర్గీకరణ కాకపోతే మనకు ఒరిగేది ఏమీలేదన్నారు. విశ్వరూప మహా సభకు ప్రతి ఇంటి నుండి అందరు స్వచ్ఛందంగా రావాలని పిలుపు నిచ్చారు. ఇది ఎన్నిక సమయం, మాదిగలకు మా వాట ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 19 ఎస్టీ రిజర్డ్ నియోజకవర్గాలలో 14కు తగ్గకుండా సీట్లు కేటాయించాలని కోరారు. కేసీఅర్ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. దీనికి నల్లాల ఓదెలు లే ఉదాహరణ అన్నారు. 70 శాతం ప్రజా ఆదరణ పొందిన ఓదెలు బలి పశువు చేశారని అన్నారు. డాక్టర్ రాజయ్యను టికెట్ ఇవ్వకుండా చేశాడు, మధిరలో మా మాదిగ బిడ్డకు టికెట్ ఇవ్వలేదు, మాకు రావాలసింది కదా? అని ప్రశ్నించారు. మంత్రి వర్గంలో మాకు స్థానం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో మాకు గాడ్ ఫాదర్ లు లేరు, మంచిర్యాల జిల్లా పరిధిలో రెండు సీట్లు మాదిగలకు రావాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో మాదిగలు మెజారిటీ, పొత్తుల్లో బెల్లంపల్లి సీపీఐ పార్టీకి ఇవ్వాలని కోరారు. సీపీఐకి బెల్లంపల్లి లే కోరుకోవాలన్నారు. చెన్నూర్ కొరుకోకుడదని, కాంగ్రెస్ లో నల్లాల ఓదెలు, డాక్టర్ దాసరపు శ్రీనివాస్, రాధిక ఉన్నరని తెలిపారు. బీఆర్ఎస్ లో ఉండే కాంగ్రెస్ కోవర్టులు నల్లాలఓదెలు కు టికెట్ రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరులో మాదిగలకు టిక్కెట్ రాకుండా చేస్తే.. వారిని ఒడిస్తామని, మాకు అన్యాయం చేసిన పార్టీని మాదిగ పల్లెలో రాకుండ చేస్తామని స్పష్టం చేశారు.
Leo: రెండో రోజు వంద కోట్ల డ్రాప్… మండేకి పరిస్థితి ఏంటి?
Also Read
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!