Kishan Reddy: ఎయిర్పోర్ట్ని తలదన్నే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad Railway Station Will Be Developed As Airport Says Kishan Reddy: ఎయిర్పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రూ.719.30 కోట్లతో స్టేషన్ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో రైల్వేస్టేషన్ ప్లాట్ఫార్మ్లను పూర్తిగా ఆధునీకరిస్తామని వెల్లడించారు. పార్కింగ్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. 26 ఆధునిక లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, 4 అంతస్తుల్లో కారు పార్కింగ్, 2 ట్రావెలేటర్లు నిర్మించనున్నామని చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ రైల్వే స్టేషన్గా సికింద్రాబాద్ను తీర్చిదిద్దుతామని అన్నారు. అది కూడా కేవలం మూడు సంవత్సరాలలోనే.. మూడు దశల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ కొత్త ఏర్పాట్లతో.. రానున్న 30 ఏళ్లకు సరిపడ వసతులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి వచ్చినట్లేనని కిషన్ రెడ్డి చెప్పారు.
అటు.. కాజీపేటలో కూడా రూ.384 కోట్లతో వ్యాగన్ వర్క్షాప్ కోసం టెండర్లు పిలిచామని, దీని కోసం 150 ఎకరాల భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్ రెండోదశ పనులకు రాష్ట్రం నిధులు ఇవ్వాల్సి ఉందని, వాటిని విడుదల చేస్తే పనులు త్వరగా పూర్తవుతాయని చెప్పారు. విజయవాడ, సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్ రైళ్లు కూడా రాబోతున్నాయని.. వాటిని తిరుపతి వరకు పొడిగించాలని రైల్వేశాఖను కోరామన్నారు. ఇదిలావుండగా.. న్యూ ఢిల్లీ, అహ్మదాబాద్, ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వే స్టేషన్లను కూడా ఆధునీకరణ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకు మొత్తం రూ. 10,000 కోట్లు నిధులు కేటాయించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆల్రెడీ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఎలా ఉండబోతోందన్న మాస్టర్ ప్లాన్ని విడుదల చేశారు. ఎయిర్పోర్ట్ని తలదన్నే విధంగా ఢిల్లీ ఎయిర్పోర్టుని నిర్మించనున్నారు. రూ. 4,700 కోట్ల వ్యయంతో 2030 కల్లా ఈ స్టేషన్ని నిర్మించాలని పక్కా ప్లాన్ వేశారు.
Also Read
Visited & Reviewed various railway works including redevelopment of the Secunderabad Railway Station at Secunderabad Stn today.
The state of the art railway station, being built at a cost of more than Rs.719 Crores will provide all modern facilities to the railway passengers
1/3 pic.twitter.com/vRZ0OwAlVY— G Kishan Reddy (@kishanreddybjp) November 14, 2022
తాజావార్తలు
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!