Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Secunderabad Railway Station Concerns Remand Report

Agnipath Protest : ఎన్టీవీ చేతిలో సికింద్రాబాద్ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్ట్

Published Date :June 20, 2022 , 7:08 pm
By Gogikar Sai Krishna
Agnipath Protest : ఎన్టీవీ చేతిలో సికింద్రాబాద్ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇటీవల కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంపై సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసింది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసు రిమాండ్ రిపోర్ట్ ఎన్టీవీకి అందింది.. అయితే.. సికింద్రాబాద్ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం లో మొత్తం 56 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొదటి నిందితుడితో పాటు A13 నుండి A56 వరకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. A2 నుండి A 12 వరకు పరారీ ఉన్నారని, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా A1 మధుసూధన్ ఉన్నట్లు తెలిపారు. అల్లర్లలో 18 మంది ప్రత్యక్ష సాక్షులుగా చేర్చిన పోలీసులు.. 56 మంది నిందితులు ఫిజికల్, మెడికల్ ఫిట్ నెస్ సాధించి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

అగ్నిపథ్ లంచ్ కావడంతో, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ గ్రూప్, హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ గ్రూప్స్, ఛలో సికింద్రాబాద్ ARO3 గ్రూప్, ఆర్మీ GD2021 మార్చ్ ర్యాలీ గ్రూప్, CEE సోల్జర్ పేర్లతో వాట్సాప్‌ గ్రూపులు క్రియేట్ చేసిన అభ్యర్థులు.. ఆ గ్రూపుల ద్వారా సికింద్రాబాద్ స్టేషన్ లో విధ్వంసం చేయాలని ప్లాన్ చేశారు. అభ్యర్థులకు పలు ప్రైవేట్ డిఫెన్స్ ఆకాడమీలు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. తమ ప్లాన్ లో భాగంగా ఉదయం 8.30 నిమిషాలకు కలువాలని నిర్ణయించుకున్నా. ఘటన రోజు ఉదయం స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ నెంబర్‌ 1, 3 నుంచి ఎంట్రీ ఇచ్చి.. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా అభ్యర్థులు నినాదాలు చేశారు. ఆత్మరక్షణ కోసమే పోలీసులు నిరసన కారులపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. బుల్లెట్ తగిలి రాకెష్ మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయని, దర్యాప్తులో ఉద్యోగార్థులను ప్రైవేట్ అకాడమీ వారే రెచ్చగొట్టినట్లు తేలిందన్నారు. బీహార్ లో జరిగిన అలర్లను వాట్సప్ గ్రూప్ లలో ప్రచారం చేశారని, స్టేషన్ కు వచ్చే సమయంలోనే పెట్రోల్ వెంట తేవాలని కొంత మంది సూచనలు చేశారన్నారు.

విధ్వంసం కారణంగా రైల్వే శాఖకు 20 కోట్ల నష్టం వాటిలిందని పోలీసుల తెలిపారు. అయితే.. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి అకాడమీ యజమాని ఆవుల సుబ్బారావు పేరు రిమాండ్ రిపోర్ట్ లో కనిపించలేదు. ఈ నెల 17న 12 గంటల సమయంలో స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు చేశాడు. ఉదయం 2వేల మంది బోయగూడ వైపు స్టేషన్ లోకి ఎంట్రీ అయ్యారు. లోపలకి వచ్చిన అనంతరం నినాదాలు చేయడం మొదలు పెట్టారు. అందులో కొంత మంది రైలు ఇంజిన్, కోచ్ ల పై రాళ్లు విసిరారు. ఆ టైం లో స్టేషన్ లో ధనపూర్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరి కొన్ని రైళ్లు ఫ్లాట్ ఫామ్‌లపై ఉన్నాయి. ఒక్కసారిగా ఉద్యోగార్థులు చేతుల్లో రాడ్లు, కర్రలు పట్టుకొని రైళ్ళ పై దాడులు చేశారు.

ఫ్లాట్ ఫామ్ నెంబర్ 10 పై ఉన్న రైల్లో 4 వేల లీటర్ల హెచ్‌ఎస్‌డీ, 3వేల లీటర్ల ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్ తో ఉన్న రెండు ఇంజిన్ లు ఉన్నాయి. సమూహంలో కొంత మంది ఆ రెండు ఇంజిన్ లకు నిప్పు పెట్టె ప్రయత్నం చేశారు. పోలీస్ సిబ్బంది అడ్డుకునే క్రమంలో పోలీస్ పై రాళ్ళ దాడి చేశారు. రెండు ఇంజిన్ లకు నిప్పు అంటుకుంటే భారీ నష్టం జరుగుతుందని భావించిన పోలీసులు కాల్పులు జరిపారు అని ఆయన పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • LATEST TELUGU NEWS
  • remand report
  • secunderabad railway station

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions