Schools Reopen: ముగిసిన వేసవి సెలవులు.. నేటి నుంచి స్కూళ్లు రీ ఓపెన్..
- నిన్నటితో వేసవి సెలవులు ముగిశాయి
- నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
- మొదటి రోజునే విద్యార్థులకు కొత్త యూనిఫారాలు
- కొత్త ట్రెండ్ను ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Schools Reopen: నిన్నటితో వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే.. మొదటి రోజునే విద్యార్థులకు కొత్త యూనిఫారాలు అందించే కొత్త ట్రెండ్ను రేవంత్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకాలంలో యూనిఫారాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ యూనిఫారాల కుట్టు బాధ్యతలను కూడా మహిళా సంఘాలకే అప్పగించాలని నిర్ణయించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ సంకల్పం నెరవేర్చి గడువులోగా కుట్టుపనులు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మహిళా సంఘాలకు కుట్టుపని అప్పగించినప్పటి నుంచి ఎప్పటికప్పుడు అధికారులు, మహిళా సంఘాలను సమన్వయం చేస్తూ గడువులోగా యూనిఫారాలు పాఠశాలకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
Read also: Astrology: జూన్ 12, బుధవారం దినఫలాలు
Also Read
- CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..
- Heavy Rains: తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు.. రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు!
- OTR : దేశ రాజధానిలో తెలంగాణకు కేర్ ఆఫ్ లేకుండా పోతుందా?
- TIMS Jobs : టిమ్స్ సనత్నగర్లో భారీ ఉద్యోగాల భర్తీ.. 3 నోటిఫికేషన్లు విడుదల
దేశంలోనే తొలిసారిగా విద్యార్థినుల యూనిఫాం కుట్టించే పనిని మహిళా సంఘాలకు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. పనులు చేసిన మహిళా సంఘాలు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, పీఆర్ఆర్డీ, సీఈవో సర్ప్, కలెక్టర్లు, సర్ప్ అధికారులు, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీఓలు ఏపీఎం, సీసీ తదితర అధికారులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీకి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో పరిమిత సంఖ్యలో టైలర్లకు కుట్టించే పనిని అప్పగించడంతో సకాలంలో యూనిఫారాలు అందడం లేదు.
Read also: PM Modi: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పులు.. కారణమిదే!
ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, టైలర్ల నిర్లక్ష్యం కారణంగా పాఠశాల ప్రారంభమై మూడు, నాలుగు నెలలైనా విద్యార్థులకు యూనిఫాం అందడం లేదన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను గ్రహించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు కుట్టుపని అప్పగించి కుట్టు ఖర్చును 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచి మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించారు. రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళా సంఘం సభ్యులు, 18 వేల గ్రామ సంఘాలు ఉన్నాయి. వీరికి 15 లక్షల 30 వేల 603 (ఒక జత) యూనిఫాంలు కుట్టించాలని ప్రభుత్వం ఆదేశించగా.. ఇప్పటి వరకు 90 శాతం యూనిఫాంలు సిద్ధమైన సంగతి తెలిసిందే. రూ. కుట్టుపనితో మహిళా సంఘాలకు ఏటా 50 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. భవిష్యత్తులో కూడా మహిళా సంక్షేమ కార్యక్రమాలను అందజేసి మరింత ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
Hyderabad: కుటుంబం మొత్తం అదే పని.. పోలీసులు ఏం చేశారంటే..?
తాజావార్తలు
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Rajnikanth : నేను మాట్లాడినా సమస్యే.. మాట్లాడకపోయినా సమస్యే
-
India Iran Travel Advisory: ఇరాన్కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
-
Sachin Tendulkar-ICC: హ్యాట్సాఫ్.. ఐసీసీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు!
ట్రెండింగ్
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!