Schools Reopen: ముగిసిన వేసవి సెలవులు.. నేటి నుంచి స్కూళ్లు రీ ఓపెన్..
- నిన్నటితో వేసవి సెలవులు ముగిశాయి
- నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
- మొదటి రోజునే విద్యార్థులకు కొత్త యూనిఫారాలు
- కొత్త ట్రెండ్ను ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Schools Reopen: నిన్నటితో వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే.. మొదటి రోజునే విద్యార్థులకు కొత్త యూనిఫారాలు అందించే కొత్త ట్రెండ్ను రేవంత్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకాలంలో యూనిఫారాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ యూనిఫారాల కుట్టు బాధ్యతలను కూడా మహిళా సంఘాలకే అప్పగించాలని నిర్ణయించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ సంకల్పం నెరవేర్చి గడువులోగా కుట్టుపనులు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మహిళా సంఘాలకు కుట్టుపని అప్పగించినప్పటి నుంచి ఎప్పటికప్పుడు అధికారులు, మహిళా సంఘాలను సమన్వయం చేస్తూ గడువులోగా యూనిఫారాలు పాఠశాలకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
Read also: Astrology: జూన్ 12, బుధవారం దినఫలాలు
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
దేశంలోనే తొలిసారిగా విద్యార్థినుల యూనిఫాం కుట్టించే పనిని మహిళా సంఘాలకు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. పనులు చేసిన మహిళా సంఘాలు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, పీఆర్ఆర్డీ, సీఈవో సర్ప్, కలెక్టర్లు, సర్ప్ అధికారులు, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీఓలు ఏపీఎం, సీసీ తదితర అధికారులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీకి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో పరిమిత సంఖ్యలో టైలర్లకు కుట్టించే పనిని అప్పగించడంతో సకాలంలో యూనిఫారాలు అందడం లేదు.
Read also: PM Modi: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పులు.. కారణమిదే!
ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, టైలర్ల నిర్లక్ష్యం కారణంగా పాఠశాల ప్రారంభమై మూడు, నాలుగు నెలలైనా విద్యార్థులకు యూనిఫాం అందడం లేదన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను గ్రహించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు కుట్టుపని అప్పగించి కుట్టు ఖర్చును 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచి మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించారు. రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళా సంఘం సభ్యులు, 18 వేల గ్రామ సంఘాలు ఉన్నాయి. వీరికి 15 లక్షల 30 వేల 603 (ఒక జత) యూనిఫాంలు కుట్టించాలని ప్రభుత్వం ఆదేశించగా.. ఇప్పటి వరకు 90 శాతం యూనిఫాంలు సిద్ధమైన సంగతి తెలిసిందే. రూ. కుట్టుపనితో మహిళా సంఘాలకు ఏటా 50 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. భవిష్యత్తులో కూడా మహిళా సంక్షేమ కార్యక్రమాలను అందజేసి మరింత ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
Hyderabad: కుటుంబం మొత్తం అదే పని.. పోలీసులు ఏం చేశారంటే..?
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!