Satyavathi Rathod: బీజేపీకి మూడో స్థానమే.. తెలంగాణలో ఆ పార్టీకి చోటు లేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyavathi Rathod criticized union minister Kishan Reddy: కేంద్రమంత్రి ఒక పార్లమెంట్ కే పరిమితమై పనిచేయడం సిగ్గు చేటని.. నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి సత్యవతి రాథోడ్. బీజేపీకి తెలంగాణలో చోటు లేదని.. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన మూడో స్థానమే అని ఆమె అన్నారు. తెలంగాణలో బీహార్ కూలీలు 30 లక్షల మంది ఉన్నారని.. రాష్ట్రంలోని అనేక సంస్థల్లో వారు పనిచేస్తున్నారని ఆమె అన్నారు. బీహార్ సీఎం కేసీఆర్ ను పొగిడిన విషయం అందరూ చూశారని.. కిషన్ రెడ్డికి తెలుగు తప్ప, ఇతర భాషలు రావు, అర్థం కావని సెటైర్లు వేశారు. కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డగా ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: DGP Rajendranath Reddy: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై స్పందించిన డీజీపీ..
Also Read
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న తీరు మీకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన వాటాలు ప్రాజెక్టులకు జాతీయ హోదాను అడ్డుకుంటున్నా.. ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. మీరు తెలంగాణకు ఏం తెచ్చారో ముందు చెప్పి మాట్లాడితే బాగుంటుందని అన్నారు. ఏపీ విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. హైదరాబాద్ కు రావాల్సిన ఐటీఐఆర్ ను అడ్డుకున్నారని మండిపడ్డారు. ట్రైబల్ యూనివర్సిటీ, కాళేశ్వరానికి జాతీయ హోదా, మిషన్ భగీరథకు కేంద్ర సాయాన్ని కోరిన మొండి చేయి చూపించారని అన్నారు.
పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం కట్టింది ఎంత.. మీరు తిరిగి ఇచ్చింది ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. మన ఊరు- మనబడికి కేంద్రం నిధులు ఇచ్చింది, దానికి కేసీఆర్ పేరు చెప్పుకుంటున్నారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మన ఊరు మనబడి కాన్సెప్ట్ కేంద్రం ప్రవేశ పెడితే, ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదు…. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. కేసీఆర్ గారిని రాజకీయంగా బలహీనపరచాలని.. ఇబ్బంది పెట్టాలని చూస్తే కుదరదని సత్యవతి రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలకు పేదవాళ్ల అండ తప్పకుండా ఉంటుందని అన్నారు. రాజకీయంగా నాలుగు మాటలు మాట్లాడితే మాకు జరిగే నష్టం ఏం లేదని అన్నారు. బీజేపీ నాయకులు ఒక్కొక్క పార్లమెంట్ ఒక్కొక్క కేంద్రమంత్రి వచ్చి వ్యతిరేక ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు పోయే ఆలోచన, అవసరం లేదని సత్యవతి రాథోడ్ అన్నారు.
తాజావార్తలు
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
-
Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!