Satyavathi Rathod: బీజేపీకి మూడో స్థానమే.. తెలంగాణలో ఆ పార్టీకి చోటు లేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyavathi Rathod criticized union minister Kishan Reddy: కేంద్రమంత్రి ఒక పార్లమెంట్ కే పరిమితమై పనిచేయడం సిగ్గు చేటని.. నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి సత్యవతి రాథోడ్. బీజేపీకి తెలంగాణలో చోటు లేదని.. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన మూడో స్థానమే అని ఆమె అన్నారు. తెలంగాణలో బీహార్ కూలీలు 30 లక్షల మంది ఉన్నారని.. రాష్ట్రంలోని అనేక సంస్థల్లో వారు పనిచేస్తున్నారని ఆమె అన్నారు. బీహార్ సీఎం కేసీఆర్ ను పొగిడిన విషయం అందరూ చూశారని.. కిషన్ రెడ్డికి తెలుగు తప్ప, ఇతర భాషలు రావు, అర్థం కావని సెటైర్లు వేశారు. కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డగా ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: DGP Rajendranath Reddy: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై స్పందించిన డీజీపీ..
Also Read
- Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
- Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
- BRS MLAs: కేటీఆర్, హరీశ్రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అరెస్ట్
- BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న తీరు మీకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన వాటాలు ప్రాజెక్టులకు జాతీయ హోదాను అడ్డుకుంటున్నా.. ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. మీరు తెలంగాణకు ఏం తెచ్చారో ముందు చెప్పి మాట్లాడితే బాగుంటుందని అన్నారు. ఏపీ విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. హైదరాబాద్ కు రావాల్సిన ఐటీఐఆర్ ను అడ్డుకున్నారని మండిపడ్డారు. ట్రైబల్ యూనివర్సిటీ, కాళేశ్వరానికి జాతీయ హోదా, మిషన్ భగీరథకు కేంద్ర సాయాన్ని కోరిన మొండి చేయి చూపించారని అన్నారు.
పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం కట్టింది ఎంత.. మీరు తిరిగి ఇచ్చింది ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. మన ఊరు- మనబడికి కేంద్రం నిధులు ఇచ్చింది, దానికి కేసీఆర్ పేరు చెప్పుకుంటున్నారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మన ఊరు మనబడి కాన్సెప్ట్ కేంద్రం ప్రవేశ పెడితే, ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదు…. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. కేసీఆర్ గారిని రాజకీయంగా బలహీనపరచాలని.. ఇబ్బంది పెట్టాలని చూస్తే కుదరదని సత్యవతి రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలకు పేదవాళ్ల అండ తప్పకుండా ఉంటుందని అన్నారు. రాజకీయంగా నాలుగు మాటలు మాట్లాడితే మాకు జరిగే నష్టం ఏం లేదని అన్నారు. బీజేపీ నాయకులు ఒక్కొక్క పార్లమెంట్ ఒక్కొక్క కేంద్రమంత్రి వచ్చి వ్యతిరేక ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు పోయే ఆలోచన, అవసరం లేదని సత్యవతి రాథోడ్ అన్నారు.
తాజావార్తలు
-
Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
-
Ram Charan : చరణ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. కానీ?
-
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
-
Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!