Sangareddy Crime: జహీరాబాద్ లో విషాదం.. హాస్టల్లో బాలుడు అనుమానాస్పద మృతి
- సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో విషాదం..
- సెవెంత్ డే ప్రైవేటు స్కూల్ హాస్టల్లో ఐదో తరగతి బాలుడు అనుమానాస్పద మృతి..
- విద్యార్థి మృతి పై తల్లిదండ్రులు-విద్యార్థి సంఘాల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy Crime: జహీరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్లో ఉంటున్న బాలుడు అనుమానాస్పదంగా మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని సెవెంత్ డే ప్రైవేటు స్కూల్ లో సాత్విక్ అనే బాలుడు ఐదో తరగతి చదువుకుంటున్నాడు. అక్కడే హాస్టల్లో ఉంటూ చదువుకొనసాగిస్తున్నాడు. అయితే ఈరోజు ఉదయం సాత్విక్ మృతి చెందాడు. హాస్టల్ లో మంచం వద్ద కిందపడివున్న సాత్విక్ ను చూసిన మరికొందరు బాలురు వెంటనే యాజమాన్యానికి సమాచారం ఇచ్చినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు. అయితే స్వాత్విక్ వెళ్లి చూడగా మృతి చెందాడని తెలిపారు. దీంతో వెంటనే సాత్విక్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. సాత్విక్ హాస్టల్ లో మంచం పైనుంచి పడి మృతి చెందాడని స్కూల్ యాజమాన్యం చెబుతున్నారు. వెంటనే సాత్విక్ మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించామని అన్నారు. అయితే సాత్విక్ తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకోగా జహీరాబాద్ లో సాత్విక్ మృతదేహం వుందని అన్నారు.
Also Read
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి.!
Read also: Nagarjuna Sagar to Srisailam Tour: ప్రారంభమైన నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణం…
దీంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకోగా సాత్విక్ మృతదేహాన్ని బోరున విలపించారు. సాత్విక్ కు తల, పెదవులు, కనుబొమ్మలపై గాయాలు ఉన్నాయని మండిపడ్డారు. హాస్టల్ లో మంచం పైనుంచి పడితే ఇలా గాయాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. తన బిడ్డను హాస్టల్లో కొట్టారని, దాని వల్లే సాత్విక్ చనిపోయాడని ఆరోపిపంచారు. విద్యార్థి మృతి పై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగారు. దీంతో జహీరాబాద్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానిక సమాచారంతో ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆందోళన విరమించాలని సాత్విక్ కుటుంబ సభ్యులను కోరారు. న్యాయం జరిగేంత వరకు సాత్విక్ మృతదేహాన్ని కదిలించే ప్రశక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పై చదువులు చదువుకుని తల్లిదండ్రులకు తోడుగా ఉంటాడని అనుకుంటూ హాస్టల్ యాజమాన్యం సాత్విక్ ను పొట్టన పెట్టుకుందని కన్నీరుమున్నీరుగా విలపించారు.
Vinod Kumar: బండి సంజయ్ గారూ.. తిట్ల పురాణం పక్కన పెట్టి రహదారిని విస్తరిస్తే మంచిది..
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!