NTV Telugu Site icon

Bandi Sanjay: తాగి పండుకునే కేసీఆర్ ను అల్లాతో పోలుస్తారా? కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: తాగి పండుకునే కేసీఆర్ ను అల్లాతో పోలుస్తారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండిసంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే నమాజ్ మైకులు బంద్ అయితాయి అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో బండి సంజయ్ మాట్లాడుతూ.. మసీదుకుపోయిన రాజకీయ నాయకులు టోపీలు పెట్టుకుని అల్లాను మొక్కడం లేదని అన్నారు. కనీసం అల్లా గురించి వారికి తెలియదు టోపీ పెట్టుకొని రాముడిని, సీతనే మొక్కుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. మసీదుకు వచ్చి నమాజ్ చేస్తున్నారని ముస్లిం సమాజం వారికి ఓట్లు గుద్దుతున్నారని అన్నారు. తాగి పండుకునే కేసీఆర్ ను అల్లాతో పోలుస్తారా? మీరే ఆలోచించుకోవాలని అన్నారు. కేసీఆర్ ఒక పాస్పోర్ట్ బ్రోకర్.. అలాంటి వ్యక్తిని అల్లాతో పోలుస్తారా? అని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలానే జరుగుతుందా? కేటీఆర్ చెప్పాలని అన్నారు.

వినాయక చవితికి మైకులు పెట్టుకోవాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు. దేవాలయాల్లో పూజలు చేసే సాధుసంతులు, పూజారులు బయటికి రావాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లిం మత పెద్దల వలనే సాధుసంతులు బయటికి వచ్చి హిందువులను సంగతి చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికలు రాగానే కేసీఆర్ కు రామ జన్మభూమి గుర్తుకొస్తుందన్నారు. అవును నేను ధైర్యంగా చెప్తున్నా నేను కర సేవలో పాల్గొన్నారు. కేసీఆర్ అవసరం అనుకుంటే రామాయణాన్ని మార్చి అయోధ్యలో రాముడు పుట్టలేదని తిరిగి చరిత్ర రాస్తాడని అన్నారు. బీజేపీని గెలిపిస్తే మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు వేస్తామన్నారు. మెట్రో ఇచ్చేదే ప్రధాని మోడీ అన్నారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడని మండిపడ్డారు. యువతకి ఉద్యోగాలు రాలేదు కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. మోడీ 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని బండి సంజయ్ తెలిపారు.
Congress Manifesto: రేపు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల