Arabian Mandi : ఫ్రిడ్జ్లో బొద్దింకలు.. అపరిశుభ్రంగా కిచెన్ పరిసరాలు.. తనిఖీల్లో బయటపడ్డ బాగోతం
- సైనిక్ పురి అరేబియన్ మండిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
- రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన ఎగ్ మయనూస్ వాడుతున్నట్లు గుర్తింపు
- కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయన్న అధికారులు
- కిచెన్, ఫ్రిడ్జ్ లో బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arabian Mandi : హైదరాబాద్ నగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ, ఐటీ హబ్గా, వాణిజ్య కేంద్రంగా మారుతోంది. ఈ అభివృద్ధికి అనుగుణంగా రెస్టారెంట్లు, హోటళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. నగరవాసుల జీవన శైలిలో మార్పుల కారణంగా రెస్టారెంట్లపై ఆదరణ పెరిగినా, అందులో అందిస్తున్న ఆహార నాణ్యతపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పలు హోటళ్లలో ఆహార నాణ్యత మాంద్యం చెందడం, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం సిద్ధం కావడం తీవ్ర సమస్యగా మారింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నా, పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా హోటళ్ల యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు అనేక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
హైదరాబాద్లో ఉన్న అనేక హోటళ్లు, చిన్న పెద్ద రెస్టారెంట్లు కస్టమర్లకు శుభ్రమైన వాతావరణాన్ని అందించడంలో విఫలమవుతున్నాయి. ప్రత్యేకంగా కిచెన్ పరిసరాలు, వంట చేసే ప్రాంతాల్లో అనేక అస్వచ్ఛతలు కనిపిస్తున్నాయి. పలు హోటళ్లలో నిర్వహించిన తనిఖీల్లో కీటకాలు, చీమలు, ఎలుకలు కనిపించడం వంటి ఉదంతాలు బయటకు వస్తున్నాయి. వంట పాత్రలు సరిగ్గా శుభ్రం చేయకపోవడం, నిల్వ పెట్టిన పదార్థాల్లో పురుగులు, ఆఫ్లాటాక్సిన్ వంటి విషతత్వ పదార్థాలు ఉండటం లాంటివి తట్టుకోలేని నిజాలు.
AP Assembly Budget Session: మార్చి 19 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
కొన్ని హోటళ్లలో వాడే నూనె మళ్లీ మళ్లీ వేడి చేసి వాడడం, పురాతన పదార్థాలను పునర్వినియోగించడం, కాలపరిమితి ముగిసిన పదార్థాలతో వంటలు చేయడం వంటి పరిస్థితులు పెరుగుతున్నాయి. ఈ అక్రమ విధానాల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు పెరుగుతోంది.
ఇటీవల కాలంలో ఆహార మలినాలతో తినేవారిలో విషజ్వరాలు, కడుపునొప్పి, వాంతులు, డయేరియా వంటి ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. కొన్ని ఘటనల్లో ఫుడ్ పొయిజనింగ్ కారణంగా ప్రాణాంతక పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. చెడు ఆహారంతో సమస్యలు ఎదుర్కొన్న బాధితులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన సంఘటనలు ఇటీవల పెరిగాయి. ఇది ప్రజలకు సీరియస్ వార్నింగ్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫుడ్ సెఫ్టీ అధికారులు తరచుగా హోటళ్లను తనిఖీ చేస్తున్నప్పటికీ, అనేక రెస్టారెంట్లు మార్పు లేకుండా పాత పద్ధతుల్లోనే పని కొనసాగిస్తున్నాయి. కొన్ని హోటళ్లను మూసివేసినా, కొన్ని రోజుల్లోనే తిరిగి తెరిచేస్తున్నారు. హోటళ్ల యాజమాన్యంపై భారీ జరిమానాలు విధించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రెస్టారెంట్ల లైసెన్సింగ్ విధానాన్ని కఠినతరం చేయాలని, ఆహార నాణ్యత ప్రమాణాలను గట్టిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే.. తాజాగా సైనిక్ పురి అరేబియన్ మండి రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన ఎగ్ మయనూస్ వాడుతున్నట్లు గుర్తించారు అధికారులు. మ్యారినేట్ చేసిన 15 కిలోల చికెన్ వారం రోజుల నుంచి ఫ్రిడ్జ్ లో రెస్టారెంట్ నిర్వాహకులు స్టోర్ చేసినట్లు, అలాగే సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయన్న అధికారులు.. కిచెన్, ఫ్రిడ్జ్లో బొద్దింకలు తిరుగుతున్నట్లు తనిఖీలు బయటపడిందని తెలిపారు. కుకింగ్ ఆయిల్ రిపేటెడ్ గా వాడుతున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్కు నోటీసులు ఇచ్చారు అధికారులు.
MLC Elections 2025: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల!
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..