Joginapally Santosh Kumar: జోగినిపల్లి సంతోష్ కుమార్ కు లేఖ రాసిన సద్గురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sadguru wrote a letter to Joginapally Santosh Kumar: దేశంలో 52% వ్యవసాయ భూములు నిస్సారమైనట్టు సద్గురు జగ్జీవాసుదేవ్ తెలిపారు. దేశంలో మట్టి క్షీణత తీవ్రమైన సమస్యగా మారిందని. ఈ విపత్కర పరిస్థితుల్లో మనం మన నేలను కాపాడుకోకపోతే.. దేశంలో వ్యవసాయ సంక్షోభం సంభవించే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి రాసిన లేఖలో “సేవ్ సాయిల్ మూమెంట్” సాధించిన ప్రగతిని సద్గురు వివరించారు.
ఈ జఠిలమైన నేలనిస్సార సంక్షోభ సమస్యకు పరిష్కారం చూపించేందుకు తాను యూరప్ లో మొదలుపెట్టి సెంట్రల్ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఇండియా లలో 100 రోజుల్లో 30 వేల కిలోమీటర్లు బైక్ ర్యాలీ చేసి 3.9 బిలియన్ల ప్రజలకు “సేవ్ సాయిల్” సందేశం చేరవేసినట్టు లేఖలో ఆయన తెలిపారు. నేలను కాపాడేందుకు “దేశంలో రైతులు వ్యవసాయంలో 3-6% సేంద్రియ పద్దతులను అనుసరించేలా చేయడం”. రైతులకు “కార్బన్ క్రెడిట్ ఇన్సెంటీవ్స్” అందించేందుకు కృషిచేయడం, “పండిన పంట పోషకాల ఆధారంగా కాకుండా.. అవి పండించిన నేలలోని సేంద్రియ లెక్కల ఆధారంగా లేబుల్ చేయడం” అనే మూడు ఆశయాలతో ముందుకు సాగుతున్నట్టు.. అందుకోసం దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్టు సద్గురు తెలిపారు. అంతేకాదు, “సేవ్ సాయిల్” మూవ్ మెంట్ ను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఎంపీ సంతోష్ కుమార్ నుంచి మరింత సహకారం ఆశిస్తున్నట్టు లేఖలో తెలిపారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
Read Also: Pawan Kalyan: ప్రతి కుటుంబం వారంలో ఒకసారి చేనేత వస్త్రాలు ధరించాలి
సద్గురు లేఖపై స్పందించిన సంతోష్ కుమార్.. “సేవ్ సాయిల్” మూమెంట్ అద్భుతమైన కార్యక్రమమని.. అందుకే హైదరాబాద్ లో సద్గురు నిర్వహించిన “సేవ్ సాయిల్” కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను భాగం చేసినట్టు తెలిపారు. మట్టిని కాపాడాలంటే మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారమని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!