Sabitha Indra Reddy : స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం విజయవంతం చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Educational Minister Sabitha Review Meeting on Independence Day.
స్వేచ్చా భారతావని కోసం అశువులుబాసిన ఎంతో మంది త్యాగధనుల చరిత్రను గుర్తు చేస్తూనే నేటి తరం యువతలో దేశభక్తిని పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న పోరాటయోధులను స్మరిస్తూనే వారి త్యాగాలను నేటి యువతకు తెలిసేలా చర్యలు చేపట్టాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ‘ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమం సందర్బంగా గురువారం నాడు తన కార్యాలయం నుంచి జిల్లా విద్యా శాఖ అధికారులు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారులతోను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో 15 రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొనేలా చూడాలని అధికారులను కోరారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం ’ కార్యక్రమం సందర్బంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయడానికి, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి విద్యా శాఖ తరుపున ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం ’ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆగస్టు 8 నుంచి 22 వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నామని మంత్రి తెలిపారు.
Also Read
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
- Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
పాఠశాల విద్యార్థులు మొదలు కొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఈ ఉత్సవాలల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటాలు, జరిగిన త్యాగాలు, నాటి జాతీయ నాయకులు, అమరుల వివరాలు నేటి తరానికి తెలిసేలా వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, జాతీయ భావాలను రగిలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, పీజీ, విశ్వవిద్యాలయాలు సహా గురుకులాల్లో మొత్తం 15రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు గాంధీ సినిమా ను చూసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, ఈ సందర్బంగా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఆగస్టు 10 తేదీన వజ్రోత్సవ వన మహోత్సవాన్ని నిర్వహించి ప్రతీ విద్యా సంస్థలో కనీసం 75 మొక్కలను నాటాలని కోరారు. జిల్లా విద్యా శాఖాధికారులు, జిల్లా ఇంటర్మీడియేట్ అధికారులు, యూనివర్సిటిల వైస్ ఛాన్సలర్లు ప్రణాళిక బద్దంగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Srikanth Odela : నాని ‘పారడైజ్’లో మెగాస్టార్? శ్రీకాంత్ ఓదెల మైండ్ బ్లోయింగ్ మల్టీవర్స్ ప్లాన్!
-
Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
-
Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్పై సజ్జల తీవ్ర విమర్శలు..
-
RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..
-
Virat Kohli: నన్ను త్వరగా అవుట్ చేయాలని అందరూ చూస్తారు.. ఏం పర్లేదు, నా ప్లాన్స్ నాకుంటాయి!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!