Revanth Reddy: అయిన వారికి ఆకుల్లో, కానీ వారికి కంచాల్లో.. కేసీఆర్ తీరుపై రేవంత్ రెడ్డి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy’s letter to CM KCR About compensation for martyrs: బీహార్ రాష్ట్రంలో గల్వాన్ లోయ అమర వీరులకు తెలంగాణ ప్రభుత్వం తరుపున సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం చేశారు. అయితే దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో పెడుతున్నారని కేసీఆర్ తీరును విమర్శించారు. తెలంగాణ ప్రజల చెమట, రక్త, కష్టార్జితం నుంచి కట్టిన పన్నుల సొమ్మును.. అత్త సొమ్ముడు అల్లుడు దాని చేసినట్లు ఉందని విమర్శించారు. మీరు దేశం అంతా తిరిగి పప్పుబెల్లాలుగా పంచుతున్నారని విమర్శించారు.
అమర జవాన్లు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా వారి త్యాగం పట్ల, వారి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉందని…ఐతే ఇంట్లో ఈగట మోత, బయట పల్లకిల మోత తీరుగా ఉన్న కేసీఆర్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు లేఖలో పేరొన్నారు. గల్వాన్ లోయలో అమరవీరులకు పరిహారం అందచేసిన మీ పర్యటనలో జవాన్ల కుటుంబాల సానుభూతి కన్నా.. మీ రాజకీయ, రాజ్యధికార విస్తరణ కాంక్షే ఎక్కువగా కనబడుతుందని దుయ్యబట్టారు. దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని మీరు ఉవ్విళ్లూరుతున్నారని.. అందుకే ఈ కార్యక్రమం చేపట్టారనే విషయం చిన్న పిల్లవాడికి కూడా అర్థం అవుతుందని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.
Also Read
- KTR: "23 లక్షల మందికి మానసిక క్షోభ".. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
- Telangana Liquor Shop Scam: "పేరు దళితులది.. దందా సిండికేట్లది".. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
- CM Revanth Reddy: "ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత".. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కీలక ఆదేశాలు..
Read Also: Fake Finger Prints: నయామోసం.. నకిలీ వేలిముద్రల సర్జరీ
నిజంగా అమరవీరుల జవాన్ల కుటుంబాల పట్ల సానుభూతి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమర జవాన్, దళిత బిడ్డ మల్లెపాకుల యాదయ్య కుటుంబం మీకు కనిపించలేదని ప్రశ్నించారు. యాదయ్య త్యాగం మీకు యాదికి రాలేదా..? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లెకు చెందిన యాదయ్య కాశ్మీర్ లో 2013లో ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. మీ పార్టీ తరుపున మీ కుమార్తె కవిత వెళ్లి పరామర్శించి.. ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమి, కల్వకుర్తిలో ఇంటి స్థలం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా.. ఆ హామీకి అతీగతీ లేదని విమర్శించారు.
ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్ రాష్ట్రంలోని అమరవీరులకు పరిహారం ఇవ్వడం పరిహాసంగా అనిపించడం లేదా.. అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇదేనా అమరవీరుల కుటుంబాల పట్ల మీకున్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. వెంటనే ఆ కుటుంబానికి ఇచ్చిన హామీని అమలు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Tokyo Video: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
-
LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!