CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..

  • విదేశాంగ శాఖ అనుమతి నిరాకరణపై సీఎం ఆగ్రహం లండన్ నుంచే హైదరాబాద్‌కు రేవంత్ రెడ్డి పయనం ఖర్గేకు ధన్యవాదాలు.. మద్దతుగా నిలిచిన నేతలకు కృతజ్ఞతలు హైదరాబాద్‌కు వచ్చాక పూర్తి వివరాలు చెబుతానన్న సీఎం
Cm Revanth

Cm Revanth

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యల వల్ల తన అమెరికా పర్యటన నిలిచిపోయిందని ఆరోపిస్తూ, లండన్ నుంచే నేరుగా హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, కేంద్ర వైఖరిని ఎండగట్టారు.

మద్దతుగా నిలిచిన ఖర్గేకు ధన్యవాదాలు.. నేడు హైదరాబాద్‌కు చేరుకోనున్న సీఎం

తన విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై స్పందించి, కేంద్ర వైఖరిని ప్రశ్నిస్తూ తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా తన సమస్యపై స్పందించి మద్దతు తెలిపిన పార్టీ నాయకులకు, ప్రజలకు నా కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.

లండన్ టూర్ సక్సెస్.. విదేశీ పర్యటనల రద్దుపై హైదరాబాదులో క్లారిటీ

గత మూడు రోజులుగా లండన్‌లో నిర్వహించిన అన్ని అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు విజయవంతంగా ముగిశాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే, విదేశాంగ శాఖ నిర్ణయంతో బోస్టన్ షెడ్యూల్ రద్దు కావడంతో మరికొద్ది గంటల్లోనే హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు వెల్లడించారు. విదేశీ పర్యటనలకు అనుమతి నిరాకరణ, దాని వెనుక ఉన్న కారణాలు తదితర అంశాలపై హైదరాబాద్‌కు తిరిగొచ్చాక మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.