Revanth Reddy: నేడు నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటన.. రోడ్ షో పాల్గొననున్న టీపీసీసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: ఒకవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇకపై ప్రతిరోజు కేవలం 3 అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్న ఈ ప్రచారం కాంగ్రెస్ వర్గాలలో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈరోజు కూడా రేవంత్ నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నరసపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లిలో జరిగే బహిరంగ సభల్లో రేవంత్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్, 3 గంటలకు పరకాల, సాయంత్రం 6 గంటలకు ఖైరతాబాద్, రాత్రి 8 గంటలకు నాంపల్లిలో జరిగే రోడ్ షోలు, సభల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న రేవంత్. కాగా ఇవాళ భారీ బహిరంగ సభా స్థలిని కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని నేతలకు సూచించారు. సభను విజయవంతం చేయాలని అన్నారు. నేతలంగా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
Read also: IND vs AUS Final 2023: ఛేదనలో నా గుండె దడ పెరిగింది: ప్యాట్ కమిన్స్
Also Read
- Varuna Yagam: నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
- FCRA Bill: 'మా చట్టాల గురించి మీకెందుకు?'.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
- TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
- Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
ఇక మరోవైపు.. సీఎం కేసీఆర్ సభలను సాకుగా చూపి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21న ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు హాజరై ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయం వనపర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేఘారెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే అభ్యర్థి కూచిపూడి రాజేష్ రెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న డాక్టర్ సీకుడు వంశీకృష్ణకు మద్దతుగా అచ్చంపేటలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాల్గొనే బహిరంగ సభలను జయప్రదం చేసేందుకు అభ్యర్థులు, పార్టీ నేతలు పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
OTT Release Movies: ఈ వారం ఓటీటిలో 24 సినిమాలు రిలీజ్.. ఆ సినిమాలు స్పెషల్..!
తాజావార్తలు
-
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్పాట్.. టాలీవుడ్కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
-
AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
-
Varuna Yagam: నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!