Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ‘బంపర్ గిఫ్ట్’.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం సమావేశం
- పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులపై స్పష్టమైన హామీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల చిరకాల కోరికలైన పీఆర్సీ (PRC), రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులపై ప్రభుత్వం స్పష్టమైన హామీలను ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన కీలక భేటీలో ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి టైమ్ లైన్ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
వంద రోజుల్లో రూ. 6 వేల కోట్లు..
ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రాబోయే 100 రోజుల్లో రూ.6,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నిధులను ఏయే ప్రాధాన్యతలకు ఖర్చు చేయాలనే నిర్ణయాధికారాన్ని ఉద్యోగ సంఘాలకే వదిలేస్తున్నట్లు ఆయన తెలపడం విశేషం. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ, ఇప్పటికే ప్రతి నెల ఒకటో తారీఖునే వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై తక్షణమే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారుల కమిటీని ఆదేశించారు. ఆ రిపోర్టు ఆధారంగానే పీఆర్సీపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అలాగే జూన్ 1వ తేదీ లోగా ఉద్యోగులందరికీ కొత్త ఆరోగ్య భద్రత కార్డులను అందజేస్తామని హామీ ఇచ్చారు.
Also Read
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
ఉద్యోగుల కోసం మరిన్ని నిర్ణయాలు..
గత రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగ సంఘాలు ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం కల్పించామని సీఎం తెలిపారు. ప్రతి రెండు నెలలకోసారి గుర్తింపు పొందిన సంఘాలు సమావేశమై, సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు. అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని, గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలను తాము కసరత్తు చేసి క్లియర్ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం నాటి పెండింగ్ బిల్లులను సున్నా చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి మానవీయ దృక్పథంతో సమస్యలను పరిష్కరిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!