TPCC President Revanth Reddy React on Telangana Floods.
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా… తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్య కారణం… పేదలకు, నిరుద్యోగులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని, కానీ.. కేసీఆర్… తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయం చేసాడని ఆయన మండిపడ్డారు. గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురిసి… వరద పోటెత్తుతోంది. కాంగ్రెస్ హయాంలో.. వర్షాకాలం ముందస్తు గానే అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. చర్యలు తీసుకునేది. ముఖ్యమంత్రి తో సహా… అందరూ 24 గంటలు అందుబాటులో ఉండేవారని, సమీక్ష చేయాల్సిన కేసీఆర్… ఇవన్నీ గాలికి వదిలేసాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. మానవత్వం లేని వ్యక్తి కేసీఆర్ అని, అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునే పనిలో బిజీ గా ఉన్నాడు కానీ… వరదలు, వర్షాలపై సమీక్ష చేయడం లేదని ఆయన విమర్శించారు.
Minister Harish Rao : డాక్టర్లు ఎవరూ సెలవులు తీసుకోవద్దు
కాళేశ్వరం పేరుతో.. వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్.. నిండా మునిగింది. పనికి రాకుండా అయ్యిందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కట్టినోడు ఇంజనీర్ ఆ… సన్యాసా అని ఆయన ధ్వజమెత్తారు. నిపుణులు అని చెప్పి… నిండా ముంచాడంటూ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు హాస్పిటల్ లో చేరితే… ఏం జరిగిందో కనుక్కునే సోయి లేదని, పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను.. అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. వందలాదిమంది విద్యార్థులు మంచాన పడ్డా… కొంచం కూడా సోయి లేదు అంటూ దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి.