Ranga Reddy Fire Accident: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ హార్డ్వేర్ పార్క్ లోని శ్రీనాత్ ఒవన్ ప్యాక్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. స్థానిక సమాచారంతో ఫైర్ సిబ్బంది హుటా హుటిన మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. అగ్రి ప్రమాదం గమనించిన ఉద్యోగులు కంపెనీలో నుండి బయటకు పరుగులు పెట్టారు. మంటలు ఎత్తుగా ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఐదు ఫైర్ ఇంజన్ లు ఏకధాటిగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం జరిగిపోయింది. అయితే ఫైర్ సిబ్బంది గంటల కొద్ది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Read also: Pakistan : పాకిస్థాన్లో మండుతున్న వేడి.. ఉష్ణోగ్రత రికార్డు బద్దలు
అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం స్థలం నుంచి ప్రజలు వేరే ప్రాంతానికి తరలించారు. శ్రీనాత్ ఒవన్ ప్యాక్ కంపెనీలో ఎలా అగ్ని ప్రమాదం సంభవించిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అందులో పనిచేసే సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారని, బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. అయితే స్థానిక సమచారంతో ఐదు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని అగ్ని ప్రమాదాన్ని అదుపులో తీసుకువచ్చారని అన్నారు. అయితే భారీగా ఆస్తినష్టం జరిగిందని తెలిపారు.
SRH vs RR: ఆ నిర్ణయమే మా విజయానికి కారణం: ప్యాట్ కమిన్స్

