Raj Gopal Reddy: అతను లీడర్ కాదు బ్రోకర్.. పల్లా రాజేశ్వర్ రెడ్డి పై రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Gopal Reddy: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లీడర్ కాదు,ఒక బ్రోకర్ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బచ్చన్నపేటలో రోడ్ షో,కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. అనంతంర మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది,పార్టీ సచ్చిపోయిందన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లీడర్ కాదు,ఒక బ్రోకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు కాళ్ళు పట్టుకొని, మందు, సోడా పోసి సిట్టింగ్ కాండిడేట్ నీ కాదని టికెట్ తెచ్చుకున్నాడన్నారు. పల్లా అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు సృష్టించి గెలిచాడన్నారు. జనగామ ప్రజలు ఒక ఆర్థిక ఉగ్రవాదిని గెల్పించారన్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టులో దర్యాప్తు జరగుతుందన్నారు.
Read also: Pushpa2 : వివాదాల నడుమ జనసేన గుర్తుతో అల్లు అర్జున్ ప్రచారం?
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
కోర్టులో రుజువు అయితే పల్లా, హరీష్ రావు తో పాటు 30 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుందన్నారు. అప్పుడు జనగామకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నే ఎమ్మెల్యే అంటూ క్లారిటీ ఇచ్చారు. పల్లాను 6 నెలల్లో గద్దె దించుతామన్నారు. బీఆర్ఎస్ చేసిన అవినీతి పాపాల చిట్టా బయటకి తీస్తామన్నారు. లిక్కర్ స్కాంలో కవిత జైలులో ఉంది, ఈసారి బతుకమ్మ జైలులోనే ఆడుతుందన్నారు. కాళేశ్వరం కుంభకోణం బయట పడితే ఒకరు చర్లపల్లి,మరకోరు చెంచల్ గూడ, కేసీఆర్ అండమాన్ నికోబార్ జైలుకే అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులు పాలు చేశారన్నారు. బిడ్డ జైలుకు పోతే బిడ్డ దగ్గరకు పోలేదన్నారు. కేసీఆర్ కు బిడ్డ మీద లేని ప్రేమ తెలంగాణ ప్రజల మీద ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా కేసీఆర్ బస్సులో తిరుగుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Delhi High Court : రూ.5 లక్షల కోట్ల విలువైన హెరాయిన్ మాయం.. కేంద్రానికి హైకోర్టు అక్షింతలు
తాజావార్తలు
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!