Delhi High Court : రూ.5 లక్షల కోట్ల విలువైన హెరాయిన్ మాయం.. కేంద్రానికి హైకోర్టు అక్షింతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court : ప్రభుత్వం 2018- 2020 మధ్య స్వాధీనం చేసుకున్న సుమారు 5 లక్షల కోట్ల రూపాయల విలువైన 70 వేల కిలోగ్రాముల హెరాయిన్ ఎక్కడ కనిపించకుండా పోయింది. ఇంతమొత్తంలో హెరాయిన్ రికార్డుల నుండి మాయం కావడం పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నోటీసు జారీ చేసింది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్.. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఎన్సీఆర్బీని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 9న చేపట్టనుంది.
Read Also:Rajamouli : దర్శకుడు అనిల్ రావిపూడిపై ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా..
Also Read
జర్నలిస్ట్ బీఆర్ అరవిందాక్షన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యను చేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరింది. అలాగే సీజ్ చేసిన డ్రగ్స్ను సీజ్ చేసిన విధానం, పారవేసేందుకు సంబంధించిన రికార్డులను అందజేయాలని ఆదేశించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికకు, 2018 – 2020 సంవత్సరాలలో హెరాయిన్ స్వాధీనం గురించి హోం మంత్రిత్వ శాఖ అందించిన డేటాకు మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయని పిటిషనర్ వాదించారు.
Read Also:Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. కానీ అక్కడ 4 గంటల వరకే..
5 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ మాయం
2018 – 2020 మధ్య మొత్తంగా 70,772.544 కిలోల హెరాయిన్ స్వాధీనం రికార్డుల నుండి కనిపించకుండా పోయిందని పిటిషన్ పేర్కొంది. మాయమైన డ్రగ్స్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఈ వ్యత్యాసం చాలా పెద్దదని, తక్షణం పరిష్కరించకపోతే సమాజంలో అరాచకానికి దారి తీస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయంలో సమాచారం, వివరణ కోసం తాను సాధ్యమైన ఫోరమ్లను ఉపయోగించానని, అయితే నేటికీ ప్రయోజనం లేదని పిటిషనర్ కోర్టులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!