Komatireddy Rajagopal Reddy: గెలిచేది నేను కాదు మునుగోడు ప్రజలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో ఏ ఉప ఎన్నిక జరిగినా అధికార, విపక్ష పార్టీల మధ్య సంకుల సమరం జరుగుతుంది. పోరాటాల ఖిల్లా నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక కాకరేపుతోంది. మునుగోడు మండల కేంద్రంలో స్థానిక ఫంక్షన్ హాల్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న మునుగోడు మాజీ శాసనసభ్యులు కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. మునుగోడు మండలం లో వివిధ పార్టీ లకు చెందిన కార్యకర్తలు రాజగోపాల్ సమక్షంలో బీజేపీ పార్టీ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్బంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ పాలన అంతమొందించడానికి నా రాజీనామా,మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే నా పదవి త్యాగం అన్నారు.
కేసీఆర్ కుటుంబానికి మునుగోడు ప్రజల మధ్య పోరాటమని..ఇది పార్టీ ల మధ్య పోరు కాదని..మునుగోడు ప్రజల ఆత్మగౌరవ యుద్ధం అన్నారు రాజగోపాల్ రెడ్డి. చరిత్రలోనే నిలిచిపోయే తీర్పు మునుగోడు ప్రజలు ఇవ్వాలి..మునుగోడు కు అమిత్ షా వచ్చాడు..కండువా కప్పుకోవడానికి అందరూ ఢిల్లీ వెళ్తారు..వచ్చిన మరుసటి రోజు కవిత లిక్కర్ స్కామ్ బయటపడింది..ఆ తదుపరి కెటీఆర్ ,కేసీఆర్ స్కామ్ లో బయటపడేది..నా రాజీనామా తోనే రోడ్లు, పెన్షన్లు, అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు.
Also Read
- Bhatti Vikramarka : తప్పుడు ప్రచారాలు మానండి.. రైతులకు ఉచిత కరెంట్ ఆగదు
- Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
మునుగోడుకి ఎమ్మెల్యే గా ఉండి నేను ఏమి చేయలేకపోయాను..నా రాజీనామా తోనే ఫామ్ హౌస్ లో ఉన్న సీఎం మునుగోడు వచ్చాడు..నెల రోజుల నుండి ఏ టీవీ పెట్టిన మునుగోడు గురించే వినిపిస్తోంది. మునుగోడు లో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ప్రతి ఒక్కరూ రాజగోపాల్ లే అవుతారు..ప్రాణం పోయినా సరే మునుగోడు ప్రజలు తల దించుకునే పని చేయను..కేసీఆర్ పతనం మునుగోడు నుండే మొదలు కావాలన్నారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ లో కుటుంబపాలన పోవాలని టీఆర్ఎస్ నాయకులే చెబుతున్నారు.. మునుగోడు ప్రజల చేతిలో నేను ఒక ఆయుధాన్ని ..ఈ ఆయుధంతో కేసీఆర్ ని అంతమొందించాలన్నారు రాజగోపాల్ రెడ్డి. విజయం మనదే కానీ మెజార్టీ ఎంతో మీరు చెప్పాలి..టీఆర్ఎస్ పార్టీ కి డిపాజిట్ రావొద్దు..ఇక్కడ గెలిచేది రాజగోపాల్ రెడ్డి కాదు మునుగోడు ప్రజలే అన్నారు.
Read Also: PM Narendra Modi: అటల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ
తాజావార్తలు
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
-
Bhatti Vikramarka : తప్పుడు ప్రచారాలు మానండి.. రైతులకు ఉచిత కరెంట్ ఆగదు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!