Raghunandan Rao: రిజర్వేషన్లు ఇవ్వని కేసీఆర్కు.. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao Fires On CM KCR Over Reservations: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తాజాగా సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేయూ, ఓయూ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఉంటాయని.. కానీ పల్లా యూనివర్సిటీలో రిజర్వేషన్లు లేవని సీఎం కేసీఆర్ చెప్పారని.. దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వని కేసీఆర్కు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదని వ్యాఖ్యానించారు. వరంగల్లో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సీపీ రంగనాథ్ తనకు చదువు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తాను వరంగల్ వచ్చి మాట్లాడుతున్నానన్న రఘునందన్ రావు.. తాను కొత్తగా వకీల్ చదువు నేర్చుకోవడం అవసరం లేదని, ఏ సెక్షన్ ఎందుకు వర్తిస్తుంది, ఏ సెక్షన్ ఎక్కడ పెడతారో తనకు బాగా తెలుసని చురకలంటించారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించిన ఆయన.. సిగ్గుంటే కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ని ముద్దాయిగా విచారణ చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి లబ్ది చేకూర్చారని, అందుకే క్వీడ్ ప్రోకోలో భాగంగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవిని ఆయనకు కట్టబెట్టారని పేర్కొన్నారు. వెంటనే టీఎస్పీఎస్సీకి కొత్త కమిటీ వేయాలన్నారు.
Elephant Fights Off Crocodile: బిడ్డను రక్షించడానికి మొసలితో ఏనుగు పోరాటం.. వీడియో వైరల్..
Also Read
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
అంతకుముందు.. సుఖేశ్ చంద్ర రాసిన లేఖపై రఘునందన్ స్పందించారు. ఈ లేఖ సంచలనాలకు కేంద్రబిందువుగా నిలుస్తోందని, బీఆర్ఎస్ పెద్దలతో చేసిన చాట్లో సుఖేశ్ బయటపెట్టారని తెలిపారు. తెలంగాణభవన్లో రూ.కోట్లు అప్పగించినట్లు ఆ చాట్లో ఉందన్నారు. రూ.15 కోట్లు బ్లాక్ రేంజ్ రోవర్ కారు(నం.6060)లో ఇచ్చినట్లు ఆ చాట్లో ఉందని ఆరోపించిన ఆయన.. ఆ కారు ఎవరిదో రవాణాశాఖ అధికారులు, పోలీసులు తెలపాలని డిమాండ్ చేశారు. ఆ కారు ఎవరిది.. ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో తేల్చాలని కోరారు. మనీ లాండరింగ్లో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషనర్కు లేఖలో విజ్ఞప్తి చేశారు. ఓ రాజకీయ పార్టీగా ఉంటూ బీఆర్ఎస్ మనీ లాండరింగ్కు పాల్పడిందని, కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఈ విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలంటూ సీఈసీని కోరారు. ఈ కేసును సంబంధిత కేంద్రీయ దర్యాప్తు ఏజెన్సీకి బదలాయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన ఆయన.. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించారు.
Kishan Reddy: అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదు.. కిషన్ రెడ్డి విమర్శలు
తాజావార్తలు
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
-
IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!