మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గం గులాబీ గూటిలో ఉన్న నేతల మధ్య విభేదాలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో నేడు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్లో రసాబాసగా మారింది. సమావేశాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు బాయ్ కట్ చేశారు. అధికార పార్టీ మేయర్ సామల బుచ్చిరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ టీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిరవి గౌడ్ ఆధ్వర్యంలో కౌన్సిల్ బయట నిరసన వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత కొంత కాలంగా కార్పోరేషన్ లో గ్రూపు విభేదాలు గుప్పుమంటున్నాయి. ఇటీవల మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ ల అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే తన నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతల మధ్య వార్ ఇంకా మంత్రి మల్లారెడ్డి దృష్టిలో పడిందా.. లేక నాకెందుకను ఊరుకున్నారా..? అని కొందరు అంటున్నారు.
Boduppal Municipal : కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్లో రసాబాస
