Promotions : ఇంటర్ డిపార్ట్‌మెంట్‌ పరిధిలో 81 మందికి ప్రిన్సిపాల్ పదోన్నతులు

  • ఇంటర్ బోర్డులో 81 మంది జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు
  • ప్రిన్సిపాల్స్‌గా బాధ్యతలు చేపట్టనున్న నూతన అభ్యర్థులు
  • నిబద్ధతతో కార్యాచరణ చేపట్టాలని సూచించిన ఇంటర్ డైరెక్టర్
Inter

Inter

Promotions : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్‌ పరిధిలో పనిచేస్తున్న 81 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్‌ పదోన్నతులు లభించాయి. సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈ పదోన్నతులను అధికారికంగా ప్రకటిస్తూ, ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి పరీక్షల నియంత్రణాధికారి జయప్రదా బాయి, మెదక్, రంగారెడ్డి జిల్లాల డీఐఈఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ, పదోన్నతి పొందిన లెక్చరర్లను శుభాకాంక్షలు తెలియజేశారు.

Off The Record: సాయిరెడ్డి గీతోపదేశం అర్ధం కావాల్సిన వాళ్ళకు అయిందా..?

×
×
Ad

వారు తమ బాధ్యతలను నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. విద్యా రంగ అభివృద్ధిలో ప్రిన్సిపాల్స్‌ కీలక పాత్ర పోషిస్తారని, సంస్థాగత శ్రమ, నాయకత్వం, విజన్‌ను వినియోగించి విద్యా వాతావరణాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పదోన్నతుల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో పాటు, సేవా నిబద్ధత, కృషి వంటి అంశాలను ప్రాధాన్యంగా పరిగణించామని ఆయన స్పష్టం చేశారు.

Supreme Court: ప్రధాని మోడీ-ఆర్ఎస్ఎస్‌పై కార్టూన్, సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..