P. Kodandaram: గద్దర్ చెప్పిన మాటలు ఆచరణలో పెట్టే సమయం వచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
P. Kodandaram: గద్దర్ చనిపోయే ముందు చెప్పిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్న మాటలను ఆచరణలో పెట్టే సమయం వచ్చిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రెడ్డి సంఘం భవనంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని అన్నారు. తొమ్మిది సంవత్సారాల నుండి తెలంగాణ పాలన పై తప్పులను ఎత్తి చూపుతూ ప్రజాస్వామిక తెలంగాణ కోసం కృషి చేస్తున్నామన్నారు. మాకు( తెలంగాణ ఉద్యమకారులకు ) పదవులు, కీర్తి, కిరీటాలు కాదు తెలంగాణ అభివృద్ధి మాత్రమే అన్నారు. తెలంగాణ తెచ్చుకోవడం కోసం కొట్లాట, తెలంగాణ వచ్చాక అభివృద్ధి కోసం పోరాటం అనేది ప్రొఫెసర్ జయశంకర్ ఆశయమన్నారు. తప్పులను ఎత్తి చూపినందుకే ఈ ప్రభుత్వం మా పై దాడులకు పాల్పడింది, చాలా కేసులు పెట్టిందన్నారు. రామగుండం ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉండే ప్రాంతం అని జయశంకర్ ఉన్న సమయంలోనే కేసీఆర్ తో సహా నిపుణులు ఖరారు చేశారని తెలిపారు. ఓసిపి గనులు వద్దు అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండాలనేది మా ప్రపోజల్ అని అన్నారు.
Read also: Independent Candidate: స్వతంత్ర అభ్యర్థి ఆత్మహత్య.. వారి వేధింపులే కారణమా..?
Also Read
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
కేసీఆర్ సీఎం అయ్యాక ఇక్కడి అభివృద్ధిని మర్చిపోయి, ఇక్కడి వనరులను కొల్లగొడుతున్నారని అన్నారు. స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం కాకుండా ఇతర ప్రాంతాల అభివృద్ధికి వాడుతున్నారని తెలిపారు. ఇతర ప్రాంతాలలో ఒక్కో నియోజకవర్గానికి ఏటా 50కోట్లు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడే వాడితే స్థానికులకు అత్యున్నతమైన విద్య అందించే అవకాశం ఉంటుందన్నారు. ఆఖరికి బూడిద కూడా ఇక్కడి ఎమ్మెల్యేకి ఒక “వరదాయిని” లా మారిందన్నారు. ఇక్కడి నాయకులకు లాభాలు కానీ ఇక్కడి ప్రజలకు మాత్రం మిగిలింది బూడిద మాత్రమే అన్నారు. ఆఖరికి ఆర్.ఎఫ్.సి.ఎల్ కూడా స్థానిక ఎమ్మెల్యే కి లాభం చేకూరేలా మారిందన్నారు. ఆర్.ఎఫ్.సి.ఎల్ బాధితులపై చేసిన విధానానికి ఎమ్మెల్యే పై కేసు పెట్టాలన్నారు. ఆర్.ఎఫ్.సి.ఎల్ కి ముఖ్య కారణం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, హైదరాబాద్ లో సిఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుండి తెలంగాణను కాపాడుకోవాలన్నారు. గద్దర్ చనిపోయే ముందు చెప్పిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్న మాటలను ఆచరణలో పెట్టే సమయం వచ్చిందన్నారు.
Miss Universe 2023: ‘మిస్ యూనివర్స్’గా షెన్నిస్ పలాసియోస్!
తాజావార్తలు
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
-
Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!