P. Kodandaram: గద్దర్ చెప్పిన మాటలు ఆచరణలో పెట్టే సమయం వచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
P. Kodandaram: గద్దర్ చనిపోయే ముందు చెప్పిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్న మాటలను ఆచరణలో పెట్టే సమయం వచ్చిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రెడ్డి సంఘం భవనంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని అన్నారు. తొమ్మిది సంవత్సారాల నుండి తెలంగాణ పాలన పై తప్పులను ఎత్తి చూపుతూ ప్రజాస్వామిక తెలంగాణ కోసం కృషి చేస్తున్నామన్నారు. మాకు( తెలంగాణ ఉద్యమకారులకు ) పదవులు, కీర్తి, కిరీటాలు కాదు తెలంగాణ అభివృద్ధి మాత్రమే అన్నారు. తెలంగాణ తెచ్చుకోవడం కోసం కొట్లాట, తెలంగాణ వచ్చాక అభివృద్ధి కోసం పోరాటం అనేది ప్రొఫెసర్ జయశంకర్ ఆశయమన్నారు. తప్పులను ఎత్తి చూపినందుకే ఈ ప్రభుత్వం మా పై దాడులకు పాల్పడింది, చాలా కేసులు పెట్టిందన్నారు. రామగుండం ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉండే ప్రాంతం అని జయశంకర్ ఉన్న సమయంలోనే కేసీఆర్ తో సహా నిపుణులు ఖరారు చేశారని తెలిపారు. ఓసిపి గనులు వద్దు అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండాలనేది మా ప్రపోజల్ అని అన్నారు.
Read also: Independent Candidate: స్వతంత్ర అభ్యర్థి ఆత్మహత్య.. వారి వేధింపులే కారణమా..?
Also Read
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
కేసీఆర్ సీఎం అయ్యాక ఇక్కడి అభివృద్ధిని మర్చిపోయి, ఇక్కడి వనరులను కొల్లగొడుతున్నారని అన్నారు. స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం కాకుండా ఇతర ప్రాంతాల అభివృద్ధికి వాడుతున్నారని తెలిపారు. ఇతర ప్రాంతాలలో ఒక్కో నియోజకవర్గానికి ఏటా 50కోట్లు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడే వాడితే స్థానికులకు అత్యున్నతమైన విద్య అందించే అవకాశం ఉంటుందన్నారు. ఆఖరికి బూడిద కూడా ఇక్కడి ఎమ్మెల్యేకి ఒక “వరదాయిని” లా మారిందన్నారు. ఇక్కడి నాయకులకు లాభాలు కానీ ఇక్కడి ప్రజలకు మాత్రం మిగిలింది బూడిద మాత్రమే అన్నారు. ఆఖరికి ఆర్.ఎఫ్.సి.ఎల్ కూడా స్థానిక ఎమ్మెల్యే కి లాభం చేకూరేలా మారిందన్నారు. ఆర్.ఎఫ్.సి.ఎల్ బాధితులపై చేసిన విధానానికి ఎమ్మెల్యే పై కేసు పెట్టాలన్నారు. ఆర్.ఎఫ్.సి.ఎల్ కి ముఖ్య కారణం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, హైదరాబాద్ లో సిఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుండి తెలంగాణను కాపాడుకోవాలన్నారు. గద్దర్ చనిపోయే ముందు చెప్పిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్న మాటలను ఆచరణలో పెట్టే సమయం వచ్చిందన్నారు.
Miss Universe 2023: ‘మిస్ యూనివర్స్’గా షెన్నిస్ పలాసియోస్!
తాజావార్తలు
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టిస్తాడా?..
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!