Kodandaram: టీఎస్పీఎస్సీ కమిటీ తొలగించి.. కొత్త కమిటీ వేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prof Kodandaram Demands To Remove TSPSC Committee: ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మరోసారి స్పందించారు. తాము ప్రశ్నాపత్రాల వ్యాపారాల పోరాట కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో అన్ని పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, విద్యార్ధి నేతలు కూడా ఉంటారన్నారు. టీఎస్పీఎస్సీ కమిటీని తొలగించి, కొత్తకమిటీ వేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆ తర్వాతే భర్తి చేయాలని కోరారు. ఈ లీకేజీ కారణంగా విద్యార్థులకు ఎంతో నష్టం జరిగిందని.. కాబట్టి ఒక్కొక్కరికి రూ. 1 లక్ష ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంపై తాము ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిద్దామని, హైదరాబాద్లో పెద్ద ధర్నా చేద్దామని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన వెళ్లి ఈ లీకేజీ గురించి వివరిద్దామన్నారు. తమని అరెస్ట్ చేసినా సరే, విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు భరోసా కల్పిస్తామన్నారు. ధర్నాకు ముందు పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేద్దామన్నారు. లేకలేక ఒక నోటిఫికేషన్ వేసి, దాని పేపర్లు కూడా అమ్ముకున్నారని ఆరోపించిన ఆయన.. ప్రజలకు ఇదే చెబుదామన్నారు.
Kane Williamson: కేన్ విలియమ్సన్పై గుజరాత్ టైటాన్స్ బాంబ్.. ఆ భయమే నిజమైంది!
Also Read
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
- Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
అంతకుముందు.. టీఎస్పీఎస్సీ విషయంలో ఉద్యోగులే ప్రశ్నాపత్రాలు లీక్ చేసి, వ్యాపారం చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. రాష్ట్రంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం మీద విద్యార్థులకు నమ్మకం పోయిందని పేర్కొన్నారు. గ్రూప్ 1 ప్రశ్నాపత్రం లీకేజీ కేసును సీబీఐకి అప్పజెప్పాలని, టీఎస్పీఎస్సీ పనివిధానం మీద సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్, సెక్రెటరీని వెంటనే తొలగించాలని కోరారు. పరీక్షల కొత్త షెడ్యూలను వెంటనే విడుదల చేయాలన్న ఆయన.. ప్రజలకు విశ్వాసం కల్పించాలంటే, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలని అడిగారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా ఉందని, విచ్చలవిడిగా పరీక్ష పత్రాలు లీక్ అవ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. భూ నిర్వాసితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా పనిచేస్తుందని కూడా ఆరోపణలు చేశారు. గతంలో లిఫ్టులు ఉన్న ప్రాంతంలోనే మరో కొత్త లిఫ్ట్ తేవడం.. ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేయడమేనని అన్నారు.
Upasana Konidela: చరణ్ నన్ను డబ్బుకోసమే పెళ్లి చేసుకున్నాడు అన్నారు
తాజావార్తలు
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!