Prajapalana Celebrations : ఆరు నూరైంది.. మార్పు మొదలైంది. ప్రజలకు ఇచ్చిన మాటను ప్రజా ప్రభుత్వం నూటికి నూరు పాళ్లు నిలబెట్టుకుంది. తొలి ఏడాది లోనే సుస్థిర ప్రజాస్వామిక పాలనతో దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టింది. అధికారం చేపట్టినప్పటి తొలి రోజు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో తెలంగాణ సమ్మిళిత అభివృద్ధికి నిరంతరం సమీక్షలు… సమావేశాలు నిర్వహించారు. కేవలం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలకే పరిమితం కాకుండా దాదాపు 160 వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా సంక్షేమం… అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో వినూత్న ఆలోచనతో వీటికి శ్రీకారం చుట్టారు. పదేండ్ల విధ్వంసపు ఆనవాళ్లను చెరిపేసి తెలంగాణ పునర్వైభవాన్ని కొనసాగిస్తూనే.. అన్ని రంగాల్లో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చింది. తెలంగాణను ది ఫ్యూచర్ స్టేట్గా.. హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నం తొలి ఏడాదిలోనే ఫలితాలను సాధించింది. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తటంతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి.
Masood Azhar: పాక్లో స్వేచ్ఛగా మసూద్ అజార్.. కఠిన చర్యల కోసం భారత్ డిమాండ్..
తొలి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలతో ప్రజా ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చింది. ఫలితంగా తెలంగాణలో నిరుద్యోగిత శాతం తగ్గుముఖం పట్టడం విశేషం. జాతీయ స్థాయిలో కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. గత ఏడాది 2023 జులై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9 శాతం ఉంటే.. ఈ ఏడాది 2024 జులై నుంచి సెప్టెంబర్ వరకు 18.1 శాతానికి చేరింది. విడుదల చేసిన . ఈ వానాకాలంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడింది. 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తే.. 153 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి కావటం విశేషం. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దేశమందరి దృష్టిని ఆకర్షించింది. దేశాభివృద్ధిలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందని ఇటీవలే కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. జీఎస్డీపీ వృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ టాప్లో ఉందని… ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీ దాదాపు రూ.15.52 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ప్రజా పాలన విజయోత్సవాల నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రభుత్వం చేపట్టిన 160 వివిధ అభివృద్ధి, సంక్షేమ వినూత్న పథకాలన్నీ వేటికవే ప్రత్యేకతను చాటుకున్నాయి.
1. మహాలక్ష్మి…ఆర్టీసీ బస్సుల్లోమహిళలకు ఉచిత ప్రయాణం. సగటున రోజుకు 30 లక్షల మంది మహిళా ప్రయాణికులకు లబ్ధి. రూ.1500 కోట్ల ఆదా.
2. రూ.500 కే గ్యాస్ సిలిండర్.. మహిళల వంటింటి కష్టాల నుంచి విముక్తి. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు లబ్ధి
3. గృహ జ్యోతి.. 200 యూనిట్ల వరకు విద్యుత్తు వాడే గృహాలకు ఉచిత కరెంట్. అరకోటి కుటుంబాలకు లబ్ధి.
4. ఇందిరమ్మ ఇండ్లు.. గూడు లేని నిరుపేదల సొంతింటి కల. నియోజకవర్గానికి 3500 ఇండ్లు. ఒక్కో ఇంటికిరూ.5 లక్షల చొప్పున తొలి ఏడాదిలోనే 4.50 లక్షల ఇండ్ల మంజూరు.
5. లబ్ధిదారుల ఎంపిక, నిధుల మంజూరు కోసం INDIRAMMA INDLU మొబైల్ యాప్ ప్రారంభం.
6. చేయూత.. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం.రూ.5 లక్షల పరిమితి రూ.10 లక్షలకు పెంపు. 91 లక్షల కుటుంబాలకు లబ్ధి. ఏడాదికి రూ.484 కోట్ల అదనపుభారం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.670 కోట్ల చెల్లింపు.
7. ఉద్యోగ సంక్షేమం.. ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు
8. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ఈహెచ్ఎస్ స్కీమ్లోమార్పులు
9. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీ యూనివర్సిటీల ఉద్యోగులకు 5 శాతం ఐఆర్.
10. పెండింగ్లో ఉన్న అయిదు డీఏల్లో ఒక డీఏ మంజూరు
11. ఆర్టీసి ఉద్యోగులకు 21 శాతం ఫిట్ మెంట్.
12. ఆర్టీసీలో 557 కారుణ్య పోస్టులు భర్తీ
13. ఆర్టీసీలో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రూ. కోటి ప్రమాద బీమా.
14. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లో అందుబాటులోకి వచ్చిన 251 ఎలక్ట్రిక్ బస్సులు.
15. రెండేళ్లలో అందుబాటులోకి రానున్న 2800 ఎలక్ట్రిక్ బస్సులు.
16. పెద్దపల్లి, ఏటూరు నాగారంలో కొత్త ఆర్టీసీ డిపోల మంజూరు.
17. జీ.ఓ. 317, 46లపై కేబినెట్ సబ్ కమిటీలు. బదిలీలకు ఆమోదం
18. సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా.
19. సింగరేణి కార్మికులకు పండుగ కంటే దసరా, దీపావళి బోనస్ చెల్లింపు.
20. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5 వేలు చొప్పున బోనస్
21. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల వినతులపై త్రిసభ్య కమిటీ.
22. వైద్య రంగం.. కొత్తగా 8 ప్రభుత్వమెడికల్ కాలేజీల ఏర్పాటు. ఒక్కోకాలేజీలో 50 చొప్పున, మొత్తం 400 ఎంబీబీఎస్ సీట్లు.
23. 17 నర్సింగ్ కాలేజీలు. ఒక్కోకాలేజీలో 60 సీట్లు. మొత్తం 960 బీఎస్సీ నర్సింగ్ సీట్లు.
24. 28 పారా మెడికల్ కాలేజీల ఏర్పాటు. 1680 మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు.
25. గోషామహల్లో 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఉస్మానియా హాస్పిటల్. కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన. రూ.2 వేల కోట్లతో సూపర్ స్పెషాలిటీ సేవల విస్తరణ.
26. ఆరోగ్య శాఖలో 7 వేలకు పైగా పోస్టుల భర్తీ. మరో 6300 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మరో 3 వేలకుపైగా కొత్త పోస్టులకు నోటిఫికేషన్లు.
27. ఉస్మానియా మెడికల్ కాలేజీలో రూ.121 కోట్లతో విద్యార్థులకు కొత్త హాస్టల్ బిల్డింగ్లు. గాంధీ మెడికల్ కాలేజీలో రూ. 80 కోట్లతో హాస్టళ్ల నిర్మాణం.
28. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ ప్రతి నెలా మొదటి వారంలోనే చెల్లించేలా గ్రీన్ ఛానల్ చెల్లింపులు.
29. గాంధీ, నిమ్స్, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్, ఖమ్మం, మహబూబ్నగర్ టీచింగ్ హాస్పిటళ్లలోవాస్క్యులర్ సెంటర్లు. రూ.33 కోట్లతో అత్యాధునిక వసతులు.
కొత్తగా 18 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు. ఇప్పుడున్నడయాలసిస్ సెంటర్లలో అదనంగా 79 మిషన్లు.
30. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య చికిత్సలు. గాంధీలో ఐవీఎఫ్ సేవల ప్రారంభం. త్వరలోపేట్ల బుర్జు, ఎంజీఎంలోనూఐవీఎఫ్ సేవలు.
31. నిరుద్యోగులకు వార్షిక జాబ్ క్యాలెండర్
32. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన.. సీనియర్ ఐఏఎస్ కు ఛైర్మన్ బాధ్యతలు.
33. ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు అభ్యర్థుల వయో పరిమితి పెంపు.
34. తొలి ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. అభ్యర్థులకు నియామక పత్రాలు.
35. మెగా డీఎస్సీ. రికార్డు వేగంతో 52 రోజుల్లో టీచర్ పోస్టుల భర్తీ. బదిలీలు. పదోన్నతులు.
36. గతంలో పేపర్లు లీకై.. రెండుసార్లు రద్దయిన గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ.
37. 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాల హామీ.
38. సింగరేణిలో కారుణ్య నియామకాలు.. ఉద్యోగ నోటిఫికేషన్లు.
39. రాజీవ్ అభయహస్తం. సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు రూ. లక్ష ఆర్థిక సాయం
40. తెలంగాణ పునర్నిర్మాణం.. సబ్బండ వర్గాల తెలంగాణ తల్లి విగ్రహం. సచివాలయంలో 17 అడుగుల విగ్రహావిష్కరణ
41. తెలంగాణ రాష్ట్ర గీతంగా అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’.
42. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి.
43. మహాత్మా జ్యోతిభా పూలే ప్రజా భవన్ లోకి అందరికి ప్రవేశం.
44. ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్ పునరుద్ధరణ.
45. ఆర్ధిక, విద్యుత్, సాగునీటి రంగాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం.
46. వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్లపై టీఎస్ ను టీజీగా మార్చడం.
47. కాల్యుష నివారణ కోసం కాలం చెల్లిన వాహనాలను తొలగించడానికి వెహికల్ స్క్రాపింగ్ పాలసీ ప్రకటన.
48. తెలంగాణ EV పాలసీ 2024 ను ప్రకటించింది. రెండేళ్ల పాటు రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు.
49. 44 మంది ట్రాన్స్ జెండర్లనుహైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియామకం.
50. తెల్లాపూర్ లో గద్దర్ విగ్రహం ఏర్పాటు. కవులు కళాకారులు సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డు.
51. కోఠి మహిళా కాలేజీకి తెలంగాణ పోరాట స్ఫూర్తి చాకలి ఐలమ్మ పేరు
52. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు
53. రాష్ట్రంలో కొత్తగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ
54. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
55. తెలంగాణ మహిళా శక్తి.. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేసే సంకల్పం.
56. మహిళలకు వడ్డీ లేని రుణాల పునరుద్ధరణ.
57. మహిళలకు రుణ బీమా పథకం.
58. మహిళా సంఘం సభ్యురాలికి రూ.10 లక్షల ప్రమాద బీమా.
59. మహిళా సంఘాలకు 5 ఏండ్లలో రూ.లక్ష కోట్లు. ఏటా 5000 గ్రామ సంఘాలకు రూ.5000 కోట్లు.
60. శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్
61. మహిళా సంఘాలకు స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పని అప్పగింత.
62. డైరీ సహకార రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు ప్రారంభం.
63. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయింపు.
64. అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు కొత్త గా 213 అంబులెన్స్ లు.
ఒక్క ఏడాదిలో నే రికార్డు స్థాయిలో రూ. 835 కోట్ల CMRF సాయం
65. గల్ప్ కార్మికులకు భరోసా..దేశంలోనే మొదటిసారిగా గల్ప్ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు.
66. గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా.
67. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో ప్రాధాన్యత క్రమంలో అడ్మిషన్లు.
68. మహాత్మా జ్యోతి బా ఫూలే ప్రజా భవన్లో ప్రవాసీ ప్రజావాణి. ప్రతి మంగళవారం, శుక్రవారం గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, ఎన్నారైల ఫిర్యాదులకు అవకాశం.
69. రక్షణ శాఖ భూములకు క్లియరెన్స్
70. ఎనిమిదేండ్లుగా పెండింగ్లో ఉన్న రక్షణ శాఖ భూముల్లో నిర్మాణాలకు కేంద్రం అనుమతి.
71. మెహిదీపట్నంలో స్కైవాక్ నిర్మాణానికి లైన్ క్లియర్.
72. గ్రేట్ ప్లాన్ తో.. గ్రేటర్ విజన్ తో సిటీలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఎలివేటేడ్ కారిడార్లు, మెట్రో, రోడ్లు, రవాణా సదుపాయాల విస్తరణ
73. హైదరాబాద్లోని చెర్వులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా.
74. గోదావరి జలాలతో మూసీ పునరుజ్జీవం. ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ కు పునర్వైభవం.
75. మూసీ నదిలోకి చేరుతున్న మురికి నీటిని శుద్ధి చేసేందుకు 39 ఎస్టీపీల ఏర్పాటు. 20 టీఎంసీల గోదావరి నీళ్లను హైదరాబాద్ లో తాగునీటికి, మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహానికి తరలించేందుకు టెండర్లు.
76. మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణ.రూ. 24,237 కోట్లతో 76.4 కిలోమీటర్ల పొడిగింపు. నాగోల్ నుంచి శంషాబాద్, రాయదుర్గ్–కోకాపేట్, ఎంజీబీఎస్– చాంద్రాయణ గుట్ట , మియాపూర్– పటాన్చెరు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు రెండో దశలో విస్తరిస్తారు.
77. అల్వాల్ సమీపంలో రాజీవ్ రహదారిపై రూ.2232 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన.
78. హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై రూ.1580 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ కు భూమిపూజ.
79. ఎల్ బీ నగర్ సమీపంలో బైరామాల్ గూడ ఫ్లైఓవర్ ప్రారంభం. ఆరంఘఢ్ నుంచి జూ పార్క్ వరకు ఫ్లైఓవర్.
80. మీర్ అలం చెరువు సమీపంలో దాదాపు రూ. 360 కోట్ల అంచనా వ్యయంతో 4-లేన్ వంతెన నిర్మాణం.
81. బాపూఘాట్ ను దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలను సిద్ధం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ సెంటర్ ఇక్కడ నెలకొల్పనుంది.
82. హైదరాబాద్ సిటీలో 100 కొత్త ఆర్టీసీ బస్సులు.
83. హైకోర్టు నూతన భవనానికి బుద్వేల్లో 100 ఎకరాల స్థలం కేటాయింపు.
84. హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (HCITI) ప్రాజెక్ట్ ద్వారా జీహెచ్ఎంసీలో రూ. 5,942 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు.
85. వాన పడితే నీళ్లు నిలిచి ట్రాఫిక్ స్తంభించిపోతున్న సమస్యను పరిష్కరించేందుకు సిటీలో నీళ్లు నిల్వ ఉండే జంక్షన్లన్నింటా వాటర్ ఇన్ టేక్ వెల్స్.
86. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని అధిగమించేలా రూ.826 కోట్లతో అండర్ పాస్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణం.. ఆరు జంక్షన్ల అభివృద్ధి.
87. రూ.18 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం). సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 189 కిలోమీటర్ల రహదారి నిర్మాణం.
88. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లతో పాటు ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ రహదారికి ప్రతిపాదనలు.
89. హైదరాబాద్ లో దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు.
90. కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. క్యాంపస్ నిర్మాణం ప్రారంభం.
91. యంగ్ ఇండియా ఫిజకల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి త్వరలోనే భూమిపూజ
92. ఏఐ సిటీకి భూమిపూజ.
93. గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్.
94. బీసీ కుల గణన.. దేశంలోనే చారిత్రాత్మకంగా ఇంటింటి సర్వే. నవంబర్ 6 నుంచి సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే. ఇప్పటికే 96 శాతం పూర్తి.
95. ధరణి ప్రక్షాళనకు అయిదుగురు సభ్యుల కమిటీ. దాదాపు మూడు లక్షల ధరణి పెండింగ్ అర్జీల పరిష్కారం.
96. ప్రైవేటు కబంధ హస్తాల్లో ఉన్న రైతుల రికార్డులు, ధరణి సాఫ్ట్ వేర్ ప్రభుత్వ అధ్వర్యంలోని ఎన్ఐసీకీ అప్పగింత.
97. కొత్త ఆర్వో ఆర్ ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టానికి కసరత్తు.
98. రైతు రుణమాఫీ.. దేశంలోనే రికార్డు. రైతులకు సంబంధించి రెండు లక్షల వరకు పంట రుణం ఏకకాలంలో మాఫీ. 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణాలు మాఫీ.
99. రైతు భరోసా. ఎకరానికి రూ.5 వేల చొప్పున 69 లక్షల మంది రైతులకు రూ.7625 కోట్ల చెల్లింపు. ఎకరానికి రూ.7500 ఇచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియమించింది.
100. సన్న వడ్లకు రూ.500 బోనస్. వానాకాలం ధాన్యం కొనుగోళ్లతో పాటు చెల్లించిన ప్రభుత్వం.
101. పంటల బీమా పథకం పునరుద్ధరణ. రూ.1300 కోట్ల ప్రీమియం చెల్లింపు. రైతు బీమాకు రూ.1455 కోట్లు.
102. కోదండరెడ్డి ఛైర్మన్గా రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు.
103. రూ.97 కోట్లతో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్.
104. ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు నష్ట పరిహారంతో పాటు బాధితులకు సాయం అందించేందుకు రూ.260 కోట్లు కేటాయించింది.
105. ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు.
106. వేసవి సెలవుల్లోనే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన. అమ్మ ఆదర్శ కమిటీల సారధ్యంలో రూ.667.25 కోట్ల పనులు.
107. పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు. 20 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు.
108. ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహణ. టెట్ పరీక్ష ఫీజు తగ్గింపు. గతంలో టెట్ రాసిన వారికి ఫీజు మినహాయింపు ఇవ్వడం జరిగింది.
109. అంగన్ వాడీల్లో ప్రీ స్కూల్ విధానాన్నిఅమలు.
110. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలోని 7.65 లక్షల మంది విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40 శాతం పెంపు. కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంపు.
111. రాష్ట్రంలో 65 ఐటీఐలలోఅడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు. టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో కొత్త వర్క్ షాప్లు.రూ.2700 కోట్లతో పనులు.
112. అన్ని నియోజకవర్గాల్లో 100 ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాల ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లు.
113. ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో 5 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మంజూరు.
114. రాష్ట్రంలో 26 అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాత వాటిని విస్తరించటంతో పాటు కొత్తం 19 అథారిటీలు నెలకొల్పింది.
115. హైదరాబాద్ కేంద్రంగా బయో ఏషియా సదస్సు ఏర్పాటు చేసింది..జీనోమ్ వ్యాలీ ఫేజ్-2 ఏర్పాటు హామీ.
116. డ్రోన్ పైలెట్ల శిక్షణకు ఎన్ఆర్ఎస్సీతో స్టేట్ ఏవియేషన్ అకాడమీతో ఒప్పందం చేసుకుంది.
117. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి రూ. 40232 కోట్ల పెట్టుబడులు.30 వేల ఉద్యోగాల కల్పనకు భరోసా.
118. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికా, దక్షిణకొరియా పర్యటన సందర్భంగా దాదాపు రూ.31502 కోట్ల పెట్టుబడులు.
119. టీజీఐపాస్ ద్వారా రూ.12626 కోట్ల పెట్టుబడులతో 1901 యూనిట్లకు అనుమతులు.
120. టీజీఐఐసీ ద్వారా రూ.8378 కోట్ల పెట్టుబడులతో 368 కంపెనీలకు అనుమతులు.
121. కాగ్నిజెంట్ హైదరాబాద్లో 15 వేల కొత్త ఉద్యోగాలతో నూతన కార్యాలయం ప్రారంభించింది. దీంతో పాటు ఫెడ్ ఎక్స్ గ్లోబల్ లాజిస్టిక్స్ అడ్వాన్సుడ్ కేపబిలిటీ సెంటర్, జెడ్ఎఫ్ లైఫ్ టెక్, మారియట్, లండన్ స్టాక్ ఎక్ఛేంజీ గ్రూప్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను నెలకొల్పాయి.
122. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుకు కీలక ఒప్పందం చేసుకుంది.
123. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
124. దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ కేంద్రంలో గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు నిర్వహించింది.
125. మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
126. 39 డిగ్రీ కాలేజీల్లో బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం అధ్వర్యంలో జాబ్ గ్యారంటీ మినీ డిగ్రీ కోర్సును ప్రారంభించింది.
127. యాద్రాద్రి పేరు యాదగిరిగుట్టగా మార్పు. భక్తులు కొండ పై నిద్ర చేసేలా డార్మెటరీ హాలు నిర్మాణం. ఆలయ విమాన గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం పనులు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు.
128. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి రూ.127.65 కోట్ల నిధులు మంజూరు.
129. భద్రాచలం రామాలయ అభివృద్ధికి రూ.180 కోట్లు కేటాయింపు.
130. తెలంగాణ కుంభమేళాగా పేరుపొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రూ.110 కోట్లు ప్రభుత్వం మంజూరు.
131. మహబూబ్నగర్ జిల్లా కురుమూర్తి దేవాలయం అభివృద్ధి రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
132. వెనుక బడిన వర్గాల అభ్యున్నతికి కొత్తగా ఎనిమిది కార్పొరేషన్ల ఏర్పాటు. ముదిరాజ్, యాదవ కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, గంగపుత్ర కులాల కార్పొరేషన్లు.
133. రాష్ట్రంలో కల్లు గీత కార్మికుల రక్షణకు “కాటమయ్య రక్షణ కవచం” ప్రత్యేక కిట్లు.
134. నిరంజన్ అధ్యక్షతన బీసీ కమిషన్ ఏర్పాటు.
135. బూసాని వెంకటేశ్వర్లు సారధ్యంలో తెలంగాణ వెనుకబడిన తరగతుల ప్రత్యేక కమిషన్ ఏర్పాటు.
136. వచ్చే ఐదేండ్లలో అన్ని సాగునీటి ప్రాజెక్టుల కింద 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చేలా ప్రాధాన్యత క్రమంలో పనులు.
137. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం కుంగుపోవటం, ఈ ప్రాజెక్టు డిజైన్లలో జరిగిన అవకతవకలపై విచారణకు జ్యుడిషియల్ కమిషన్.
138. ఖమ్మం జిల్లాలో లక్షన్నర ఎకరాలకు సాగునీటిని అందించేలా సీతారామ ప్రాజెక్టు పూర్తి. ఆగస్ట్ 15న ప్రారంభించిన ముఖ్యమంత్రి.
139. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ. 2027 సెప్టెంబర్ లోగా పనులు పూర్తి చేసేందుకు రూ. 4,658 కోట్ల కేటాయింపు.
140. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన. కొడంగల్ తో పాటు మక్తల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు, తాగునీటిని అందించే ఈ ప్రాజెక్టుకు రూ.4350 కోట్ల ప్రతిపాదనలు.
141. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, గతంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు
142. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు. తొలి ఏడాదిలో రూ. 10,444 కోట్లు సబ్సిడీ చెల్లింపు.
143. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్తు. రాష్ట్రంలోని 39067 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తు.
144. విద్యుత్తు ఛార్జీలను పెంచకుండా రాష్ట్రంలో 1.85 కోట్ల మంది వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా.
145. యాదాద్రి థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం పనుల వేగవంతం. 800 మెగావాట్ల ఒక యూనిట్ ప్రారంభం.
146. దేశంలోనే వినూత్నంగా మహిళా శక్తి సంఘాల అధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు. 4000 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తికి ప్రణాళిక.
147. అవసరమైన చోట్ల 244 కొత్త సబ్ స్టేషన్లు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెహికల్స్.
148. గిగ్ వర్కర్లు కోసం రూ. 5 లక్షల ప్రమాద భీమా అమలు.
149. మామునూర్ ఎయిర్ పోర్ట్ భూసేకరణ కోసం రూ. 205 కోట్లు మంజూరు.
150. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి రూ. 5 వేల కోట్లు కేటాయింపు.
151. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్దికి రూ. 14 వేల కోట్లు కేటాయింపు.
152. పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధికి రూ. 400 కోట్లు కేటాయింపు.
153. ప్రతి నియోజకవర్గానికి రూ. 10 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయింపు.
154. తాగునీటి సరఫరా కోసం ఆర్డబ్ల్యూఎస్కురాష్ట్రప్రభుత్వం రూ.3,046.26 కోట్లుకేటాయింపు.
155. ప్రజా ప్రభుత్వంలో ప్రొ. జయశంకర్ స్వగ్రామం అక్కంపేటకు రెవెన్యూ హోదా ప్రకటన
156. పద్మ శ్రీ గ్రహీతలకు సన్మానం. రాష్ట్ర ప్రభుత్వం తరుపునఒక్కొకరికి రూ. 25 లక్షలచెక్కుఅందజేత. ప్రతి నెల రూ. 25 వేల పెన్షన్ మంజూరు.
157. ఆదిలాబాద్జిల్లాఇంద్రవెల్లిమండలంఇంద్రవెల్లిగ్రామం- బిలోఉన్నఅమరవీరులస్తూపంవద్దగలస్మృతివనంసుందరీకరణ.
158. చేనేత కార్మికులకు సంబంధించిన రూ. 290 కోట్ల పాత బకాయిలు విడుదల.
159. జే.ఎన్.జే.హెచ్.ఎస్ కు ( JNJHS) జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమికి సంబంధించిన స్వాధీన ప్రతాలు అందజేత.
160. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణా మాదక ద్రవ్య నిరోధక సంస్థ (టీ.జి. న్యాబ్ – TG ANB) ను బలోపేతం.
Mohammad Siraj Got Angry: మరీ అంత కోపమెందుకు సిరాజ్.. లబుషేన్కి ఇచ్చిపడేశాడుగా