Ponnam Prabhakar: సిద్దిపేటలో అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: సిద్దిపేటలోని 220 కేవీ సబ్ స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సబ్స్టాన్లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరం. పీటీఆర్ పేలడంతో సబ్స్టేషన్లో ప్రమాదం జరిగిందని తెలిపారు. మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారని అన్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. మరోవైపు సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తాలోని 220కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్లు పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. పవర్ ట్రిప్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Read also: WPL 2024: డబ్ల్యూపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ.. షారుఖ్ స్పెషల్ పర్ఫామెన్స్!
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
కాగా.. ప్రమాదం గురించి తెలియగానే సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేయాలని ట్రాన్స్కో అధికారులు, సిద్దిపేట విద్యుత్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ అధికారులను హరీశ్ రావు కోరారు. ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
WPL 2024: డబ్ల్యూపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ.. షారుఖ్ స్పెషల్ పర్ఫామెన్స్!
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?