Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
- వ్యక్తిగత విమర్శలే ఉద్రిక్తతలకు కారణం
- భౌతిక దాడులు పిరికిపంద చర్యలే: పొన్నం
- కార్యకర్తలను అదుపులో పెట్టాలన్న మంత్రి
- ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, అయితే అవి హుందాతనాన్ని కోల్పోకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం వల్లే సమాజంలో అశాంతి నెలకొంటోందని, ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నాయకులు తమ స్థాయిని మర్చిపోయి వ్యక్తిగత దూషణలకు దిగడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. “ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించాలి. చౌకబారు ప్రచారం కోసం దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదు. ఒకరి మాటల వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుంటే, దానికి దీటుగా సమాధానం చెప్పాలే తప్ప, భౌతిక దాడులకు దిగడం పిరికిపంద చర్య” అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ప్రజాప్రతినిధుల ఇళ్లపై మరో ప్రజాప్రతినిధికి చెందిన కార్యకర్తలు దాడులు చేయడం అప్రజాస్వామికమని మంత్రి పేర్కొన్నారు. నాయకులు ఎవరైనా సరే తమ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. “దాడులకు పాల్పడుతున్న కార్యకర్తలపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఆయా నాయకులకు ప్రజాస్వామ్యంపై ఉన్న చిత్తశుద్ధి నిరూపించబడుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రతినిధులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, ప్రజల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా హితవు పలికారు. రాజకీయాలు కేవలం అధికార దాహం కోసం కాకుండా, ప్రజా సేవ కోసం ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!