Ponnam Prabhakar : రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు మంత్రి పొన్నం లేఖ
- రక్షణ మంత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ
- హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన రక్షణ భూములు
- రూ.1,000 కోట్లు యూజర్ ఛార్జీలు పెండింగ్
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు త్వరితగతిన జరపాలన్న విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : హైదరాబాద్ అభివృద్ధి కోసం రక్షణ శాఖ భూముల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వ తరపున ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఈ లేఖపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంతకాలు కూడా ఉన్నాయి.
మంత్రి పొన్నం తన లేఖలో రక్షణ శాఖ భూములను ప్రజా ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించేందుకు కేంద్రం సానుకూలంగా ముందుకు రావడంపై ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో, మౌలిక సదుపాయాల విస్తరణకు రక్షణ భూములు కీలకంగా ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
అంతేకాక, కంటోన్మెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి యూజర్ ఛార్జీల కింద సుమారు రూ.1,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన విడుదల చేస్తే ప్రజా మౌలిక వసతులు, పౌర సేవలు మరింత మెరుగుపడతాయని తెలిపారు.
ప్రజా వినియోగం కోసం భూములను కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, భూమి అప్పగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. నగరాభివృద్ధి, పౌర సౌకర్యాల కోసం జరుగుతున్న మౌలిక సదుపాయాలు, మొబిలిటీ ప్రాజెక్టులకు ఈ భూమార్పిడి అత్యవసరమని గుర్తు చేశారు.
అదే విధంగా, గత కొంతకాలంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా ఎన్నికలు త్వరితగతిన నిర్వహించాలంటూ రక్షణ మంత్రిని అభ్యర్థించారు.
హైదరాబాద్ అభివృద్ధి దిశలో రక్షణ శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుందనే విశ్వాసం తనకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!