పోర్న్ సైట్లు వీక్షించే వారిపై పోలీసుల నిఘా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటర్నెట్లో పోర్న్ వీడియోల సైట్లను వీక్షించేవారిపై పోలీసు నిఘా అధికం చేయనున్నారు. మోబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ సెంటర్లలో పోర్న్ వీడియోలు చూసేవారితో పాటు ఆయా వీడియోలను షేర్ చేసేవారిని ఐపి ఆధారంగా గుర్తించి వారిపై ఐటి చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సన్నద్థమౌతున్నారు. ఈక్రమంలో ఇంటర్నెట్లో పోర్న్ సైట్లను వీక్షించే వారిని ఆయా ఇంటర్నెట్ ఐపి ఆధారంగా గుర్తిస్తూ ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. పోర్న్ సైట్ల వీక్షించడం వల్ల మహిళలపై లైంగిక వేధింపులు అధికమౌతున్నాయని భావించిన పోలీసు బాసులు వాటిని వీక్షించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తమౌతున్నారు. ఇందులో భాగంగా నగరంలోని మూడు కమిషనరేట్ల పోలీసులు పోర్న్ వీడియోలను తరచూ వీక్షించే వారిపై ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. పోర్న్ చిత్రాల వీక్షించిన వారిపై నేరం రుజువైన పక్షంలో వారిపై ఐటి యాక్ట్తో పాటు ఐపీసీ సెక్షన్ల కింద ఏడేళ్ల జైలు శిక్షలు తప్పవని పోలీసు బాసులు హెచ్చరిస్తున్నారు.
అదేవిధంగా పోర్న్ వీడియోలను వాట్సప్లలో షేర్ చేసేవారిపైనా చట్టరీత్యా చర్యలతో పాటు కేసులు నమోదు చేసేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా పోర్స్ వెబ్సైట్ల కారణంగా అఘాయిత్యాలు పెరుగుతున్నాయని పోలీసులు భావిస్తూ ఈ తరహా చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంటల తరబడి ఫోన్లలో పోర్న్ వెబ్సైట్లలో మునిగి తేలుతున్న వారిపై పోలీసులు దృష్టి సారించనున్నారు.దీంతో పోర్న్ చూసే వారి కదలికలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచనున్నారు. అశ్లీల వీడియోలు చూసేవారు, వాటిని డౌన్లోడ్ చేసుకునే వారు, షేర్ చేసే వారిపై నిఘాపెట్టారు. ఎవరు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు, షేర్ చేస్తున్నారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో అదేపనిగా అశ్లీల వీడియోలు చూస్తున్న వారిని గుర్తించి వారికి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. హెచ్చరించినప్పటికీ మారకుండా పోర్న్ వీడియోలు చూస్తున్న వారిని అరెస్టు చేసేందుకు సిద్ధమౌతున్నారు. కేసులు నమోదు చేసిన తర్వాత వారికి శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
- Instagram Love: ఇన్స్టాగ్రామ్లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
- TG Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక ప్రకటన.. కారణం ఇదే..!
నిందితులకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అశ్లీల వీడియోలు షేర్ చేసేందుకు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులపై పోలీసులు నిఘా సారిస్తున్నారు. అశ్లీల వీడియోలు చూస్తున్న గ్రూపులోని సభ్యులను పట్టుకుని కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం. మొబైల్ ఫోన్ల ఐపి అడ్రస్ ఆధారంగా వారిని పట్టుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా మొబైల్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు రావడంతో ప్రతి ఒక్కరి చేతిలో అత్యాధునిక టెక్నాలజీ ఫోన్లు ఉంటున్నాయి. దానికి తోడు ఇంటర్ నెట్ వాడకం పెరగడంతో సులభంగా పోర్న్ వీడియోలు చేస్తూన్నారు. అంతేకాకుండా ఇంటర్నెట్ ప్యాకేజ్లు కూడా తక్కువ ధరకు లభిస్తుండడం ఒక కారణం కన్పిస్తోంది. మనదేశంలో పోర్న్ వెబ్ సైట్లపై ఆంక్షలు కూడా చాలా తక్కువగా ఉండడంతో సులభంగా వస్తున్నాయి. వాటిని నియంత్రించడంలో కూడా ప్రభుత్వాలు విఫలమయ్యాయి.
వీటిని పదేపదే చూడడం వల్ల నిందితులు ఏమి చేస్తున్నామో తెలియక అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
తర్వాత అది బయటపడుతుందని అభంశుభం తెలియని చిన్నారులను చిదిమేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ ఏడాది మూడు కమిషనరేట్ల పరిధిలో చాలా చోటుచేసుకున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ పోర్న్కు బానిసలుగా మారుతున్నారు. అదేపనిగా చూడడంతో వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోంది. ఒక్కసారి పోర్న్ వీడియోలకు బానిసలుగా మారిన తర్వాత వారిని మార్చడం చాలా కష్టంగా మారుతోందని, వారిని రిహాబిలిటేషన్ సెంటర్లలో చేర్పించినా వారిలో మార్పు తీసుకురావడం కష్టంగా మారుతోందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. ‘జొనాథన్ డేవిడ్’ హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్పై 6-0 భారీ విజయం.!
-
Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
-
Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!