Revanth Reddy: గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: హైదరాబాద్ గన్ పార్క్ సమీపంలోని అమరవీరుల స్థూపం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీపీసీసీ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఇలాంటివి అనుమతించబోమని రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు రావడంతో రేవంత్ రెడ్డి రోడ్డుపై పడేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి గాంధీభవన్కు తరలించారు. మరికొందరు కాంగ్రెస్ నేతలను కూడా అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దాం అన్నారు. 17న మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ దగ్గరకు వస్తానని, కేసీఆర్ కూడా రావాలని చెప్పారు. గత వారం కర్ణాటకలో పట్టుబడిన రూ.40 కోట్ల నగదు కొడంగల్కు వెళ్లాల్సిందేనని కేసీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ మేరకు సవాల్ విసిరారు. దీనిపై ఆ సాయంత్రం కేటీఆర్ స్పందించారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి ఎన్నికల్లో డబ్బు, మద్యం గురించి మాట్లాడి ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. కారు దిగి హస్తం గూటికి చేరుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు నిరాశే ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా బాపురావు స్థానంలో అనిల్ జాదవ్ కు టికెట్ కేటాయించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీపై బాపురావు అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలోనే ఆయన పార్టీ మారతారని ప్రచారం సాగింది.. ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. భవిష్యత్ పరిణామాలపై ఆయనతో చర్చించారు. ఈనెల ములుగు జిల్లా రామజపురంలో జరగనున్న కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ఢిల్లీ నేతల సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో రెండుసార్లు గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనకు టిక్కెట్ ఇవ్వకుండా ఇతరులకు కేటాయించడంతో బాపురావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బుజ్జగింపుల కోసం ఎదురుచూసే ప్రసక్తే లేదని పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కూడా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Harish Rao : మంత్రి పొంగులేటివన్నీ అబద్ధాల ప్రవాహాలే
- Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
- Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
- Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్లో
తాజావార్తలు
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
-
OTR: తెలంగాణ కేబినెట్లో విజయశాంతికి ఛాన్స్? ఢిల్లీలో గట్టిగా లాబీయింగ్!
-
Srimad Bhagavatam : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ టెక్నీషియన్లతో 7 భాగాలుగా ‘శ్రీమద్భాగవతం
-
Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
-
Harish Rao : మంత్రి పొంగులేటివన్నీ అబద్ధాల ప్రవాహాలే
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!