Revanth Reddy: గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: హైదరాబాద్ గన్ పార్క్ సమీపంలోని అమరవీరుల స్థూపం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీపీసీసీ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఇలాంటివి అనుమతించబోమని రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు రావడంతో రేవంత్ రెడ్డి రోడ్డుపై పడేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి గాంధీభవన్కు తరలించారు. మరికొందరు కాంగ్రెస్ నేతలను కూడా అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దాం అన్నారు. 17న మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ దగ్గరకు వస్తానని, కేసీఆర్ కూడా రావాలని చెప్పారు. గత వారం కర్ణాటకలో పట్టుబడిన రూ.40 కోట్ల నగదు కొడంగల్కు వెళ్లాల్సిందేనని కేసీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ మేరకు సవాల్ విసిరారు. దీనిపై ఆ సాయంత్రం కేటీఆర్ స్పందించారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి ఎన్నికల్లో డబ్బు, మద్యం గురించి మాట్లాడి ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. కారు దిగి హస్తం గూటికి చేరుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు నిరాశే ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా బాపురావు స్థానంలో అనిల్ జాదవ్ కు టికెట్ కేటాయించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీపై బాపురావు అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలోనే ఆయన పార్టీ మారతారని ప్రచారం సాగింది.. ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. భవిష్యత్ పరిణామాలపై ఆయనతో చర్చించారు. ఈనెల ములుగు జిల్లా రామజపురంలో జరగనున్న కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ఢిల్లీ నేతల సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో రెండుసార్లు గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనకు టిక్కెట్ ఇవ్వకుండా ఇతరులకు కేటాయించడంతో బాపురావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బుజ్జగింపుల కోసం ఎదురుచూసే ప్రసక్తే లేదని పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కూడా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!