PM Modi: దేశ వ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు.. రూ.169 కోట్లతో తెలంగాణలో 15..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. తెలంగాణలో కొత్తగా 15 అమృత్ భారత్ స్టేషన్లను నిర్మించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. రూ.230 కోట్లతో ఈ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అమృత్ భారత్ స్టేషన్లతో పాటు రూ.169 కోట్లతో 17 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించనున్నట్లు అరుణ్ జైన్ తెలిపారు. ఇవాల రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Read also: Urvashi Rautela : హాట్ టాపిక్ గా మారిన ఊర్వశీ రౌటేలా బర్త్ డే కేక్..
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
దేశవ్యాప్తంగా 553 అమృత్ భారత్ స్టేషన్ల రైల్వే అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని అరుణ్కుమార్ జైన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 553 అమృత భారత్ రైల్వే స్టేషన్లకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 1500 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్పాస్లను ప్రధానికి అంకితం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల విలువ దాదాపు రూ.621 కోట్లు ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అరుణ్ జైన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 40 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి రూ. 2,245 కోట్లు. ఇప్పటికే 21 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ భూమిపూజ చేశారని తెలిపారు.
Read also: Vijay Sankalp Yatra: నేడు తెలంగాణకు గుజరాత్ సీఎం.. కిషన్ రెడ్డి షెడ్యూల్ ఇదే..!
రూ.169 కోట్లతో….15 కొత్త అమృత్ భారత్ స్టేషన్లు
• జడ్చర్ల – రూ.10.94 కోట్లు.
• గద్వాల్ – రూ.9.49 కోట్లు.
• షాద్ నగర్ – రూ.9.59 కోట్లు.
• మేడ్చల్ – రూ.8.37 కోట్లు.
• మెదక్ – రూ.15.31 కోట్లు.
• వాహ నగర్ – రూ.12.37 కోట్లు.
• బాసర – రూ.11.33 కోట్లు.
• యాకుత్ పురా – రూ.8.53 కోట్లు.
• మిర్యాలగూడ – రూ.9.50 కోట్లు.
• నల్గొండ – రూ.9.50 కోట్లు.
• వికారాబాద్ – రూ.24.35 కోట్లు.
• పెద్దపల్లి – రూ.26.49 కోట్లు.
• మంచిర్యాల – రూ.26.49 కోట్లు.
• వరంగల్ – రూ.25.41 కోట్లు.
• బేగంపేట – రూ.22.57 కోట్లు.
Read also: Astrology: ఫిబ్రవరి 26, సోమవారం దినఫలాలు
రానున్న రోజుల్లో రాష్ట్రంలో రైల్వేలను మరింత అభివృద్ధి చేస్తాం – కిషన్ రెడ్డి
రూ.2014-15లో తెలంగాణ రైల్వే బడ్జెట్ లో 2024-25 నాటికి రూ.258 కోట్ల కేటాయింపులను రూ.5,070 కోట్లకు 20 రెట్లు పెంచడం తెలంగాణ రైల్వేల అభివృద్ధికి మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేని మెదక్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు కేంద్రం కొత్త రైలు సౌకర్యం కల్పించిందన్నారు. స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా ఇటీవలే జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైల్వేలో అపూర్వమైన అభివృద్ధిని సాధించేందుకు మరింత కృషి చేస్తామని, రాష్ట్రంలోని రైల్వే రూపు రేఖలను సమూలంగా మారుస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేసారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!