PM Modi: దేశ వ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు.. రూ.169 కోట్లతో తెలంగాణలో 15..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. తెలంగాణలో కొత్తగా 15 అమృత్ భారత్ స్టేషన్లను నిర్మించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. రూ.230 కోట్లతో ఈ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అమృత్ భారత్ స్టేషన్లతో పాటు రూ.169 కోట్లతో 17 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించనున్నట్లు అరుణ్ జైన్ తెలిపారు. ఇవాల రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Read also: Urvashi Rautela : హాట్ టాపిక్ గా మారిన ఊర్వశీ రౌటేలా బర్త్ డే కేక్..
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
దేశవ్యాప్తంగా 553 అమృత్ భారత్ స్టేషన్ల రైల్వే అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని అరుణ్కుమార్ జైన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 553 అమృత భారత్ రైల్వే స్టేషన్లకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 1500 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్పాస్లను ప్రధానికి అంకితం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల విలువ దాదాపు రూ.621 కోట్లు ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అరుణ్ జైన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 40 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి రూ. 2,245 కోట్లు. ఇప్పటికే 21 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ భూమిపూజ చేశారని తెలిపారు.
Read also: Vijay Sankalp Yatra: నేడు తెలంగాణకు గుజరాత్ సీఎం.. కిషన్ రెడ్డి షెడ్యూల్ ఇదే..!
రూ.169 కోట్లతో….15 కొత్త అమృత్ భారత్ స్టేషన్లు
• జడ్చర్ల – రూ.10.94 కోట్లు.
• గద్వాల్ – రూ.9.49 కోట్లు.
• షాద్ నగర్ – రూ.9.59 కోట్లు.
• మేడ్చల్ – రూ.8.37 కోట్లు.
• మెదక్ – రూ.15.31 కోట్లు.
• వాహ నగర్ – రూ.12.37 కోట్లు.
• బాసర – రూ.11.33 కోట్లు.
• యాకుత్ పురా – రూ.8.53 కోట్లు.
• మిర్యాలగూడ – రూ.9.50 కోట్లు.
• నల్గొండ – రూ.9.50 కోట్లు.
• వికారాబాద్ – రూ.24.35 కోట్లు.
• పెద్దపల్లి – రూ.26.49 కోట్లు.
• మంచిర్యాల – రూ.26.49 కోట్లు.
• వరంగల్ – రూ.25.41 కోట్లు.
• బేగంపేట – రూ.22.57 కోట్లు.
Read also: Astrology: ఫిబ్రవరి 26, సోమవారం దినఫలాలు
రానున్న రోజుల్లో రాష్ట్రంలో రైల్వేలను మరింత అభివృద్ధి చేస్తాం – కిషన్ రెడ్డి
రూ.2014-15లో తెలంగాణ రైల్వే బడ్జెట్ లో 2024-25 నాటికి రూ.258 కోట్ల కేటాయింపులను రూ.5,070 కోట్లకు 20 రెట్లు పెంచడం తెలంగాణ రైల్వేల అభివృద్ధికి మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేని మెదక్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు కేంద్రం కొత్త రైలు సౌకర్యం కల్పించిందన్నారు. స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా ఇటీవలే జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైల్వేలో అపూర్వమైన అభివృద్ధిని సాధించేందుకు మరింత కృషి చేస్తామని, రాష్ట్రంలోని రైల్వే రూపు రేఖలను సమూలంగా మారుస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేసారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!