PM Modi: దేశ వ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు.. రూ.169 కోట్లతో తెలంగాణలో 15..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. తెలంగాణలో కొత్తగా 15 అమృత్ భారత్ స్టేషన్లను నిర్మించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. రూ.230 కోట్లతో ఈ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. అమృత్ భారత్ స్టేషన్లతో పాటు రూ.169 కోట్లతో 17 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించనున్నట్లు అరుణ్ జైన్ తెలిపారు. ఇవాల రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Read also: Urvashi Rautela : హాట్ టాపిక్ గా మారిన ఊర్వశీ రౌటేలా బర్త్ డే కేక్..
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
దేశవ్యాప్తంగా 553 అమృత్ భారత్ స్టేషన్ల రైల్వే అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని అరుణ్కుమార్ జైన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 553 అమృత భారత్ రైల్వే స్టేషన్లకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 1500 రైల్వే ఫ్లై ఓవర్లు, అండర్పాస్లను ప్రధానికి అంకితం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల విలువ దాదాపు రూ.621 కోట్లు ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అరుణ్ జైన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 40 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి రూ. 2,245 కోట్లు. ఇప్పటికే 21 అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ భూమిపూజ చేశారని తెలిపారు.
Read also: Vijay Sankalp Yatra: నేడు తెలంగాణకు గుజరాత్ సీఎం.. కిషన్ రెడ్డి షెడ్యూల్ ఇదే..!
రూ.169 కోట్లతో….15 కొత్త అమృత్ భారత్ స్టేషన్లు
• జడ్చర్ల – రూ.10.94 కోట్లు.
• గద్వాల్ – రూ.9.49 కోట్లు.
• షాద్ నగర్ – రూ.9.59 కోట్లు.
• మేడ్చల్ – రూ.8.37 కోట్లు.
• మెదక్ – రూ.15.31 కోట్లు.
• వాహ నగర్ – రూ.12.37 కోట్లు.
• బాసర – రూ.11.33 కోట్లు.
• యాకుత్ పురా – రూ.8.53 కోట్లు.
• మిర్యాలగూడ – రూ.9.50 కోట్లు.
• నల్గొండ – రూ.9.50 కోట్లు.
• వికారాబాద్ – రూ.24.35 కోట్లు.
• పెద్దపల్లి – రూ.26.49 కోట్లు.
• మంచిర్యాల – రూ.26.49 కోట్లు.
• వరంగల్ – రూ.25.41 కోట్లు.
• బేగంపేట – రూ.22.57 కోట్లు.
Read also: Astrology: ఫిబ్రవరి 26, సోమవారం దినఫలాలు
రానున్న రోజుల్లో రాష్ట్రంలో రైల్వేలను మరింత అభివృద్ధి చేస్తాం – కిషన్ రెడ్డి
రూ.2014-15లో తెలంగాణ రైల్వే బడ్జెట్ లో 2024-25 నాటికి రూ.258 కోట్ల కేటాయింపులను రూ.5,070 కోట్లకు 20 రెట్లు పెంచడం తెలంగాణ రైల్వేల అభివృద్ధికి మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేని మెదక్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు కేంద్రం కొత్త రైలు సౌకర్యం కల్పించిందన్నారు. స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా ఇటీవలే జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైల్వేలో అపూర్వమైన అభివృద్ధిని సాధించేందుకు మరింత కృషి చేస్తామని, రాష్ట్రంలోని రైల్వే రూపు రేఖలను సమూలంగా మారుస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేసారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!