Nizamabad Hospital: ఆసుపత్రిలో రోగిని లాక్కెళ్లిన ఘటన.. తల పట్టుకుంటున్న అధికారులు
Nizamabad Hospital: నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో రోగిని లాక్కెళ్లిన ఘటన సంచలనంగా మారింది. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగిని కాళ్లుపట్టుకుని తల్లిదండ్రులు వైద్యం కోసం లాక్కొని వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు సీరియస్ అయ్యారు. కలెక్టర్, మంత్రి హరీశ్ రావు తక్షణమే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అధికారులు విచారణ ప్రారంభించారు. ఇద్దరు ప్రొఫెసర్లతో డి.ఎం.ఈ. రమేష్ రెడ్డి కమిటీ వేశారు. రోగిని కాలు పట్టుకుని వెళుతున్నప్పుడు వీడియో వైరల్ చేసిన వ్యక్తి పై ఆసుపత్రి అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు. రోగికి సంబంధించిన పూర్తి సమాచారం అధికారులకు ఇంకా దొరక్క తలలు పట్టుకుంటున్నారు. డేటా ఎంట్రీ ప్రకారం హన్మాండ్లు బోధన్ అర్సపల్లి గా నమోదు చేయడంతో సమాచారం తప్పుగా నమోదు చేయించారని అధికారులు భావిస్తున్నారు. కాగా రోగి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు. వారి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నానా తంటా పడుతున్నారు. ఒక రోగి ఆసుపత్రికి వస్తే అతని పేరు ఫోన్ నెంబర్ తో సహా ఫైల్ చేస్తారు. అలాంటిది రోగి వైద్యం కోసం వచ్చిన ఫైల్ లో సరైన సమాచారం లేకపోవడం పై పలు అనుమానాలకు దారితీస్తోంది.
అసలే జరిగింది..
Also Read
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో కాళ్లు పట్టుకుని తల్లిదండ్రులు లాక్కెళ్లిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బయట నుంచి లోపలికి కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిని తీరు అందరిని కలిచివేదసింది. తమ కొడుకు అనారోగ్యంతో వున్నాడని ఆసుపత్రిలో స్ట్రెచర్ కనిపించలేదని తల్లిదండ్రులు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది కూడా పట్టించుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి సిబ్బందిని సహరించాలని కోరినా ఎవరు నోరుమదపలేదని అన్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రోగి కాళ్లు పట్టుకుని తీసుకొని వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నిజామాబాద్ ఆస్పత్రి సిబ్బంది తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో సరైన వసులులేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు మండిపడుతున్నారు. అక్కడికి వెళ్లి వైద్యులు అందుబాటులో ఎవరూ ఉండని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆసుపత్రిలో వైద్యులు, స్ట్రెచర్, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో కూడా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్యాసింజర్ ఆటోల్లో మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలు సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్
అయితే ఈ పరిణామాలపై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ స్పందించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. మార్చి 31న పేషెంట్ను ఆస్పత్రికి తీసుకొచ్చారని.. చిట్టితో ఓపీ వచ్చేలోపు లిఫ్ట్ రావడంతో పేషెంట్ను తల్లిదండ్రులు లాక్కెళ్లారని తెలిపారు. 2వ అంతస్తుకు చేరుకున్న రోగిని వీల్ చైర్ లోనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. ఏం జరిగిందో తెలియని ఓ వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆసుపత్రిపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకూడదని ఆమె తెలిపారు.
IPL 2023 : ముంబై ఇండియన్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ఢీ..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!