Asaduddin Owaisi: అతీక్ అహ్మద్ హత్యపై ఘాటుగా స్పందించిన అసదుద్దీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. అతిక్, అతని సోదరుడి దారుణ హత్య యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తుల చేతులకు సంకెళ్లు కూడా ఉన్నాయి. అలాంటి వారిని గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపడం దారుణమైన ఘటన అని అన్నారు. జైశ్రీరామ్ నినాదాలు చేసిన దుండగులు, నిందితులను పోలీసులు అడ్డుకోకపోవడాన్ని అసదుద్దీన్ తప్పుబట్టారు. యోగి పాలనలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందనడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. ఎన్ కౌంటర్లు జరిగితే సంబరాలు చేసుకుంటున్న ఎన్ కౌంటర్ రాజ్యం కూడా హత్యతో సమానం అంటూ ట్వీట్ చేశారు. ఇదేనా న్యాయవ్యవస్థ, న్యాయం జరిగే తీరు అరి యూపీ సీఎం యోగి ప్రభుత్వాన్ని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఈ ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని ఒవైసీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఏ అధికారి కూడా దర్యాప్తులో పాల్గొనవద్దని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధంగా ప్రభుత్వాన్ని నడపడం లేదని.. తుపాకీ పాలనతో ప్రభుత్వం నడుస్తోందని ఒవైసీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Atiq and his brother were killed while in police custody and were handcuffed. Slogans of JSR were also raised. Their murder is a perfect example of Yogi’s big failure of law & order. Those celebrating encounter-raj are equally responsible for this murder.
Also Read
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
— Asaduddin Owaisi (@asadowaisi) April 15, 2023
ఉమేష్ పాల్ హత్య కేసులో అరెస్టయిన అతిక్ అహ్మద్ను వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తుండగా సమీపంలోని కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతిక్తో పాటు అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ కూడా అక్కడిక్కడే చనిపోయాడు. మరోవైపు గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ను పోలీసులు గురువారం ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడో రోజు కాల్పుల ఘటనలో గ్యాంగ్స్టర్ కుటుంబానికి చెందిన మరో ఇద్దరు చనిపోయారు. దీంతో.. ప్రయాగ్రాజ్లో సెక్షన్ 144 కింద విచారణకు సీఎం యోగి ఆదేశించారు.
ప్రయాగ్రాజ్లో గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ దారుణ హత్యపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఘటనా స్థలాన్ని సందర్శించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్ను ఆదేశించారు. గ్యాంగ్స్టర్ను దారుణంగా హత్య చేసిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రయాగ్రాజ్లో సెక్షన్ 144 విధించారు. శనివారం ప్రయాగ్రాజ్లో అతిక్ అహ్మద్, అతని సోదరుడిని కాల్చి చంపిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను లవలేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యలుగా పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల్లో ఓ పోలీసుతోపాటు ఓ జర్నలిస్టు కూడా గాయపడినట్లు సమాచారం.
#WATCH | UP's BJP govt has a role in this. Supreme Court-monitored investigation should be done and a committee should be formed. No officer from Uttar Pradesh should be included in the committee: AIMIM chief Asaduddin Owaisi on Atiq Ahmed and Ashraf's murder in Prayagraj pic.twitter.com/DJBrME39Dl
— ANI (@ANI) April 16, 2023
Atiq Ahmad : అతీక్ అహ్మద్ ఆర్థిక మూలాలను దెబ్బకొడుతున్న యూపీ సర్కార్
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
-
Tollywood: ఫేక్ హౌస్ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!