Site icon NTV Telugu

ఓయూ పీజీ విద్యార్థులకు వెసులుబాటు.. కోరుకున్న చోటే పరీక్షలు..!

ou

ou

కరోనా సమయంలో పీజీ విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది ఉస్మానియా యూనివర్సిటీ… పీజీ పరీక్షలు రాసే విద్యార్థులు.. తమకు దగ్గర్లో ఉన్న జిల్లా కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది… విద్యార్థి తనకు ఏ సెంటర్‌ అందుబాటులో ఉందని భావిస్తున్నాడో… ఏ సెంటర్‌లో పరీక్ష రాయాలని అనుకుంటున్నాడో.. ముందే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.. ఒకవేళ ఒక సెంటర్ లో 20 మంది విద్యార్థులు ఉంటే ఆ సెంటర్ ను మార్చడం జరుగుతుందని ఓయూ తెలిపింది.. పరీక్షా సమయం 2 గంటలుగా నిర్ణయించగా… తెలంగాణలో మొత్తం 25 చోట్ల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Exit mobile version